ఈపీఎఫ్ పై పన్ను ప్రతిపాదనను ఉపసంహరించుకున్నట్లు జైట్లీ...

- March 08, 2016 , by Maagulf
ఈపీఎఫ్ పై పన్ను ప్రతిపాదనను ఉపసంహరించుకున్నట్లు జైట్లీ...

 ఈపీఎఫ్‌పై పన్ను ప్రతిపాదనను కేంద్రం ఉపసంహరించుకుంది. ఈ మేరకు లోక్‌సభలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ప్రకటించారు. 2016-17 వార్షిక బడ్జెట్ సందర్భంగా ఈపీఎఫ్ పై పన్ను విధిస్తున్నట్లు జైట్లీ ప్రకటించిన విషయం విదితమే. బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు నుంచి అన్ని వర్గాల నుంచి విమర్శలు వెలువెత్తాయి. ఈపీఎఫ్ పై పన్ను ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. విమర్శలు భారీ స్థాయిలో వెలువెత్తడంతో ఈపీఎఫ్ పై పన్ను ప్రతిపాదనను ఉపసంహరించుకున్నట్లు జైట్లీ ప్రకటించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com