అక్రమ శాటిలైట్ డిషెస్ తొలగింపుకు డెడ్లైన్
- March 08, 2016sడిస్కవరీ గార్డెర్స్లో నివాసం ఉంటోన్నవారికి నఖీల్ మార్చ్ 10వ తేదీని డెడ్లైన్గా నిర్ణయించింది. వెంటనే అక్రమంగా ఏర్పాటు చేసిన శాటిలైట్ డిషెస్ లేదా యాంటినాస్ని రూఫ్స్ మరియు బాల్కనీల నుంచి తొలగించాలనీ, లేదంటే భారీగా జరీమానాలు విధింపబడ్తాయనీ నఖీల్ ఈ సందర్భంగా హెచ్చరికలు జారీ చేసింది. నఖీల్ ఫెసిలిటీస్ మరియు ఓనర్స్ అసోసియేషన్ మేనేజ్మెంట్ దీనికి సంబంధించి నోటీసులను జారీ చేసింది. 20,000 రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్తో అతి పెద్ద కమ్యూనిటీగా ఉంది ఇది. అక్రమంగా డిష్లను ఏర్పాటు చేస్తే 500 దిర్హామ్ల వరకు ఫైన్ విధించే నిబంధన ఇప్పటికే అమల్లో ఉంది. 2015 మార్చ్లో అబుదాబీ మున్సిపాలిటీ 2000 దిర్హామ్ల ఫైన్ని అక్రమ డిష్లు వినియోగించేవారికి విధిస్తూ నిర్ణయం తీసుకుంది. షార్జాలో ఈ ఫైన్ 500 దిర్హామ్లుగా ఉంది. షార్జాలో 1997లోనే డిష్ యాంటెనాలపై నిషేధం ఉంది. 2012 నుంచి శాటిలైట్ టీవీ డిష్ల కోసం నిబంధనను సవరించి, కొత్త నిబంధనను తెరపైకి తెచ్చారు.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం