భారత్ కరోనా అప్డేట్

- June 24, 2021 , by Maagulf
భారత్ కరోనా అప్డేట్

న్యూ ఢిల్లీ: భారత్ లో క‌రోనా కేసులు మ‌ళ్లీ క్ర‌మంగా పెరుగుతున్నాయి.  రెండు రోజుల క్రితం కేసులు 50 వేలకు దిగువున న‌మోదుకాగా, గ‌త రెండు రోజులుగా కేసులు మ‌ళ్లీ పెరుగుతున్నాయి.తాజాగా కేంద్ర ఆరోగ్యశాఖ క‌రోనా బులిటెన్‌ను విడుదల చేసింది.ఈ బులిటెన్ ప్ర‌కారం గ‌డిచిన 24 గంట‌ల్లో భారత్ లో 54,069 కేసులు న‌మోద‌య్యాయి.దీంతో భారత్లో ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 3,00,82,778కి చేరింది.  

ఇందులో 2,90,63,740 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 6,37,057 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి.ఇక‌, గ‌డిచిన 24 గంట‌ల్లో ఇండియాలో క‌రోనాతో 1321 మంది మృతి చెందారు.దీంతో భారత్ లో ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన మొత్తం మ‌ర‌ణాల సంఖ్య 3,91,981కి చేరింది.ఇక‌పోతే ఒక్క‌రోజులో 68,885 మంది కోలుకొని డిశ్చార్జ్ అయిన‌ట్టు బులిటెన్‌లో పేర్కొన్నారు.భారత్ లో ఇప్ప‌టి వ‌ర‌కు 30,16,26,028 మందికి వ్యాక్సిన్ అందించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com