కోవిడ్ ఎఫెక్ట్ తో బహ్రెయిన్ లో మరో మసీదు మూసివేత
- June 25, 2021
బహ్రెయిన్: కోవిడ్ కారణంగా బహ్రెయిన్లో మరో మసీదును తాత్కాలికంగా మూసివేశారు. ప్రార్థనకు వచ్చిన భక్తుల్లో కోవిడ్ పాజిటివ్ కేసు నిర్ధారణ కావటంతో ముహర్రాఖ్ గవర్నరేట్ పరిధిలోని మసీదును వారం పాటు మూసివేస్తున్నట్లు ఇస్లామిక్ వ్యావహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వైరస్ బారిన పడిన వ్యక్తితో ఇంకా ఎవరెవరు కాంటాక్ట్ లో ఉన్నారో ట్రేస్ చేయటంతో పాటు మసీదు ప్రాంగణంలో క్రిమిసంహారక చర్యలను చేపట్టారు అధికారులు. వారం తర్వాత తిరిగి ప్రార్ధనలకు అనుమతి ఇవ్వనున్నారు. ఇదిలా ఉంటే...రోజులో ఐదు ప్రార్ధనలకు బహ్రెయిన్ ప్రభుత్వం ఇప్పటికే అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే..ప్రార్థనకు వచ్చే భక్తులు తప్పనిసరిగా కోవిడ్ ప్రోటోకాల్ పాటించాలని అధికారులు సూచించారు. ప్రోటోకాల్ పాటించని ప్రాంతాల్లో మసీదులను మూసివేస్తున్న విషయాన్ని గుర్తు చేసింది.
తాజా వార్తలు
- సౌదీలో అక్రమ నివాసితులపై ఉక్కుపాదం.. వారంలో దాదాపు 15 వేల మంది అరెస్ట్..!!
- అక్రమ బరువు తగ్గించే మందులపై యూఏఈ ఉక్కుపాదం..!!
- ఒమన్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక సంస్కరణలు..!!
- కువైట్లో కల్తీ చేపలపై ఫుడ్ అథారిటీ కొరడా..!!
- ఖతార్లో సముద్ర రవాణా సేవలు పునరుద్ధరణ..!!
- భారత్, బహ్రెయిన్ మధ్య న్యాయ సహకారానికి కొత్త దిశ..!!
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’







