కోవిడ్ ఎఫెక్ట్ తో బహ్రెయిన్ లో మరో మసీదు మూసివేత
- June 25, 2021
బహ్రెయిన్: కోవిడ్ కారణంగా బహ్రెయిన్లో మరో మసీదును తాత్కాలికంగా మూసివేశారు. ప్రార్థనకు వచ్చిన భక్తుల్లో కోవిడ్ పాజిటివ్ కేసు నిర్ధారణ కావటంతో ముహర్రాఖ్ గవర్నరేట్ పరిధిలోని మసీదును వారం పాటు మూసివేస్తున్నట్లు ఇస్లామిక్ వ్యావహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వైరస్ బారిన పడిన వ్యక్తితో ఇంకా ఎవరెవరు కాంటాక్ట్ లో ఉన్నారో ట్రేస్ చేయటంతో పాటు మసీదు ప్రాంగణంలో క్రిమిసంహారక చర్యలను చేపట్టారు అధికారులు. వారం తర్వాత తిరిగి ప్రార్ధనలకు అనుమతి ఇవ్వనున్నారు. ఇదిలా ఉంటే...రోజులో ఐదు ప్రార్ధనలకు బహ్రెయిన్ ప్రభుత్వం ఇప్పటికే అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే..ప్రార్థనకు వచ్చే భక్తులు తప్పనిసరిగా కోవిడ్ ప్రోటోకాల్ పాటించాలని అధికారులు సూచించారు. ప్రోటోకాల్ పాటించని ప్రాంతాల్లో మసీదులను మూసివేస్తున్న విషయాన్ని గుర్తు చేసింది.
తాజా వార్తలు
- అక్రమ బెట్టింగ్..300 యాప్ల పై కేంద్రం ఉక్కుపాదం!
- అమెరికాకు వార్నింగ్ ఇచ్చిన ఇరాన్ IRGC ఆఫీసర్ హతం
- యూఏఈలో ఐక్యతను చాటిచెప్పిన ఈద్ ప్రార్థనలు..!!
- రిఫైనరీలు లక్ష్యంగా డ్రోన్ అటాక్స్..KPC క్లారిటీ..!!
- $20 బిలియన్ల నష్టం..17% దెబ్బతిన్న LNG ఎగుమతి సామర్థ్యం..!!
- సీబీఎస్ఈ క్లాస్ 10 అసెస్ మెంట్ స్కీమ్ పై పేరెంట్స్ ఆందోళన..!!
- అల్ ఖోర్ మసీదులో కింగ్ సుల్తాన్ ఈద్ ప్రార్థనలు..!!
- ఈద్ వేడుకలు.. అబుదాబి పోలీసుల హెచ్చరిక..!!
- మక్కాలోని గ్రాండ్ మసీదులో క్రౌన్ ప్రిన్స్ ఈద్ ప్రార్థనలు..!!
- తెలంగాణ బడ్జెట్ రూ.3,24,234 కోట్లు..









