మండే కాలం యూఏఈ లో తీవ్ర ఉష్ణోగ్రతలు
- June 03, 2015
రానున్న రోజుల్లో వడగాల్పుల తీవ్రత అధికంగా ఉండొచ్చని ప్రమాద ఘంటికలు పొంచి ఉన్నాయని యూఏఈ వాతావరణ శాఖ హెచ్చరించింది. మంగళవారం ఉష్ణోగ్రతలు 50 డిగ్రీల సెంటిగ్రేడ్ పైనే నమోదయ్యాయి. స్వీహాన్, అల్ అయిన్, అబుదాబీల్లో మధ్యాహ్నం 12 గంటల సమయంలో 50.5 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదయినట్లు నేషనల్ సెంటర్ ఆఫ్ మిటియరాలజీ, అండ్ సెస్మాలజీ ప్రకటించింది. ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా రక్షణ చర్యలు తీసుకోవాల్సి వుందనీ, వీలైనంతవరకు ఎండల్లో తిరగకుండా జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరని ఎమర్జన్సీ క్రైసిస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ వివిధ మాధ్యమాల ద్వారా ప్రజల్ని హెచ్చరిస్తోంది. నీడ పట్టునే ఉండటం, ఏసీ ఉపయోగించి ఇంటిని చల్లగా ఉంచుకోవడం, తగినన్ని ఫ్లూయిడ్స్ తీసుకోవడం ద్వారా వేసవి తాపం నుంచి ఉపశమనం పొందచ్చని వైద్యులు సూచిస్తున్నారు. వాతావరణంలో సంభవిస్తున్న ఈ మార్పుల కారణంగా ‘మిడ్ డే బ్రేక్’ని ముందుగా అనుకున్నదాని ప్రకారం జూన్ 15న కాకుండా, జూన్ 7 నుంచే ప్రారంభిస్తున్నట్లు అధికారులు వెల్లడిరచారు. డీహైడ్రేషన్ బారిన పడకుండా ఎక్కువసార్లు నీరు, ఇతర పానీయాలు తీసుకోవాలనీ, ఫ్యాటీ ఫుడ్స్, ఆల్కహాల్, సోడా, కెఫైన్, షుగర్ ఎక్కువగా ఉండే డ్రింక్స్ తీసుకోరాదని అధికారులు ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రచారం ప్రారంభించారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్







