2 డోసులు తీసుకోకుంటే విదేశీ ప్రయాణాలు వదన్న ఆరోగ్యశాఖ

- June 28, 2021 , by Maagulf
2 డోసులు తీసుకోకుంటే విదేశీ ప్రయాణాలు వదన్న ఆరోగ్యశాఖ

యూఏఈ: కోవిడ్ వ్యాక్సిన్లలో రెండు డోసులు తీసుకున్న తర్వాతే ప్రవాసీయులు విదేశీ ప్రయాణాలు చేయాలని యూఏఈ సూచించింది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా వైరస్ ప్రమాదకరంగా మ్యూటేషన్ చెందుతున్న విషయాన్ని ప్రజలు దృష్టిలో ఉంచుకోవాలన్నారు. వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకోవటం ద్వారా కోవిడ్ తీవ్రత నుంచి తప్పించుకునేందుకు ఆస్కారం ఎక్కువగా ఉంటుందని యూఏఈ ఆరోగ్య శాఖ అధికార ప్రతినిధి డాక్టర్ ఫరీదా అల్ హోసానీ అన్నారు. రెండు డోసులు పొందకుండా విదేశీ ప్రయాణాలు చేస్తే కోవిడ్ బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉదని, అందువల్ల రెండు డోసులు పూర్తి కాకుండా ప్రవాసీయులు విదేశీ ప్రయాణాలు మానుకోవాలని సూచించారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com