పీవీ విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించిన గ‌వ‌ర్న‌ర్, సీఎం

- June 28, 2021 , by Maagulf
పీవీ విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించిన గ‌వ‌ర్న‌ర్, సీఎం

హైదరాబాద్: మాజీ ప్ర‌ధాని పీవీ న‌ర‌సింహారావు విగ్ర‌హాన్ని గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై, ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆవిష్క‌రించారు.పీవీ శ‌త జ‌యంతి ముగింపు ఉత్స‌వాల సంద‌ర్భంగా ఆయ‌న విగ్ర‌హానికి గ‌వ‌ర్న‌ర్, సీఎం కేసీఆర్ ఘ‌న నివాళుల‌ర్పించారు. అంతకు ముందు పీవీ మార్గ్‌ను గ‌వ‌ర్న‌ర్ ప్రారంభించారు.ఈ కార్య‌క్ర‌మంలో ప‌లువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పీవీ కుటుంబ స‌భ్యులు, ప‌లువురు అధికారులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా కాసేప‌ట్లో పీవీకి సంబంధించిన తొమ్మిది పుస్తకాలను విడుదల చేయనున్నారు.ఇందులో పీవీ రాసినవి 4 ఉండ‌గా, మిగతావి ఆయన జీవితాన్ని విశ్లేషించే ప‌లువురు రాసినవి ఉన్నాయి.రాష్ట్ర ప్రభుత్వం, భాషా సాంస్కృతిక శాఖ, తెలంగాణ సాహిత్య అకాడమీ సంయుక్తంగా ఈ పుస్తకాలను ముద్రించాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com