ఆహార పదార్ధాల్లో మత్తుపదార్ధాలు..బెడిసికొట్టిన ప్లాన్

- June 29, 2021 , by Maagulf
ఆహార పదార్ధాల్లో మత్తుపదార్ధాలు..బెడిసికొట్టిన ప్లాన్

దోహా: ఆహార పదార్ధాల్లో నిషేధిత మత్తుపదార్ధాలను దాచి కస్టమ్స్ ను బోల్తాకొట్టించాలనుకున్న స్మగ్లర్ల ప్లాన్ బెడిసికొట్టింది. ఫుడ్ షిప్మెంట్లో దాచిన డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నట్లు ఎక్స్ ప్రెస్ మెయిల్ కస్టమ్స్ లోని కార్గో & ప్రైవేట్ ఎయిర్ పోర్ట్స్ కస్టమ్స్ అధికారులు వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న మత్తు పదార్ధం 522 గ్రాములు ఉందని వెల్లడించారు. మత్తుపదార్ధాలను ఏ రూపంలో దేశంలోకి స్మగ్లింగ్ చేయాలని చూసినా పట్టుకుంటామని అధికారులు మరోసారి హెచ్చరించారు. అధునాతన పరికరాలు, స్మగ్లర్ల బాడీ లాంగ్వేజ్ ను పసిగట్టగలిగే సుశిక్షితులైన సిబ్బంది తమ వద్ద ఉన్నారని అన్నారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com