ఒమన్ లో 3000 దాటిన కోవిడ్ మృతుల సంఖ్య

- June 29, 2021 , by Maagulf
ఒమన్ లో 3000 దాటిన కోవిడ్ మృతుల సంఖ్య

మస్కట్: ఒమన్ లో రికార్డ్ స్థాయి కోవిడ్ కేసులు నమోదైన మరుసటి రోజే రికార్డ్ స్థాయిలో మరణాలు కూడా సంభవించాయి. గడిచిన 24 గంటల్లో కోవిడ్ బారిన పడి 45 మంది మృతి చెందినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. కోవిడ్ సమాచారం కోసం ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన తారస్సద్ యాప్ లో నమోదైన వివరాల ప్రకారం గత 24 గంటల్లో 197 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రస్తుతం ఒమన్లో 2,243 కోవిడ్ కేసులు ఉన్నాయి. ఇందులో 1,650 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా...506 మంది ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు మొత్తం 2,64,302 మంది కోవిడ్ బారిన పడగా...2,31,718 మంది రికవరీ అయ్యారు. 3,013 మంది మృతి చెందారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com