ఒమన్ లో 3000 దాటిన కోవిడ్ మృతుల సంఖ్య
- June 29, 2021
మస్కట్: ఒమన్ లో రికార్డ్ స్థాయి కోవిడ్ కేసులు నమోదైన మరుసటి రోజే రికార్డ్ స్థాయిలో మరణాలు కూడా సంభవించాయి. గడిచిన 24 గంటల్లో కోవిడ్ బారిన పడి 45 మంది మృతి చెందినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. కోవిడ్ సమాచారం కోసం ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన తారస్సద్ యాప్ లో నమోదైన వివరాల ప్రకారం గత 24 గంటల్లో 197 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రస్తుతం ఒమన్లో 2,243 కోవిడ్ కేసులు ఉన్నాయి. ఇందులో 1,650 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా...506 మంది ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు మొత్తం 2,64,302 మంది కోవిడ్ బారిన పడగా...2,31,718 మంది రికవరీ అయ్యారు. 3,013 మంది మృతి చెందారు.
తాజా వార్తలు
- భద్రాద్రి పునర్నిర్మాణ ఆలయ నమూనా
- ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ఎంఎంటీఎస్ సేవలు: సీఎం రేవంత్
- అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేబినెట్ తీర్మానం
- రేపు అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోడీ కీలక సమావేశం
- కువైట్ లో ఉగ్రవాద కుట్ర భగ్నం..హిజ్బుల్లా నెట్వర్క్ బస్ట్..!!
- రుస్తాఖ్ ఆసుపత్రికి ఎమర్జెన్సీ ఎయిర్ లిఫ్ట్ సక్సెస్..!!
- ముహర్రాక్ ఫెసిలిటీలో అగ్నిప్రమాదం..!!
- ఖతార్ లో అస్థిర వాతావరణం..కార్మిక మంత్రిత్వ శాఖ గైడ్ లైన్స్ జారీ..!!
- CBSE న్యూ గ్రేడింగ్ సిస్టమ్
- సౌదీ అరేబియా వ్యాప్తంగా భారీ వర్షాలు.. అలెర్ట్ జారీ..!!









