ప్లాస్టిక్ వేస్ట్ మీద పోరాటంలో ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి: ఎంఎంఈ
- June 29, 2021
దోహా: మినిస్ట్రీ ఆఫ్ మునిసిపాలిటీ అండ్ ఎన్విరాన్మెంట్ (ఎంఎంఈ), పౌరులు అలాగే నివాసితులంతా ప్లాస్టిక్ వేస్ట్ వ్యతిరేక పోరాటంలో కలిసి రావాలని పిలుపునిచ్చింది. ఈ మేరకు అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా విజ్నప్తి చేసింది ఎంఎంఈ. అంతర్జాతీయ ప్లాస్టిక్ బ్యాగ్ ఫ్రీ డే (3 జులై) నేపథ్యంలో మినిస్ట్రీ ఆఫ్ మునిసిపాలిటీ అండ్ ఎన్విరాన్మెంట్, ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ మీద పోరాటంపై తమ తమ సలహాలు, సూచనలను #FutureWithoutPlastic అనే హ్యాష్ ట్యాగ్ ద్వారా తెలియజేయాలని కోరింది. ప్రత్యేక కార్యక్రమం ద్వారా అందర్నీ ఈ ఉద్యమంలో భాగస్వాముల్ని చేయడమే కాకుండా, పార్టిసిపెంట్లకు బహుమతులు కూడా అందజేయనున్నారు. కాగా, ఖతార్ 2.5 మిలియన్ టన్నుల మునిసిపల్ సాలిడ్ వేస్ట్ ప్రతి ఏడాదీ ఉ్పత్తి చేస్తోంది. ఇందులో 8 శాతం మాత్రమే రీసైకిల్ జరుగుతోంది. కరోనా పాండమిక్ నేపథ్యంలో ఈ వేస్ట్ ఇంకా ఎక్కువగా ఉత్పత్తి అయినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో రీసైక్లింగ్ అలాగే వేస్టేజీని తగ్గించడంపై ఫోకస్ పెట్టాలని ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు తీర్మానిస్తున్నాయి.
తాజా వార్తలు
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ
- బహ్రెయిన్లో న్యాయ సేవలకు ఈ-పేమెంట్ సర్వీస్..!!
- ఒమన్లో విద్యుత్ కేబుళ్ల చోరీ.. నలుగురి అరెస్టు..!!
- కువైట్లో కార్మికుల హక్కులకు మరింత రక్షణ..!!
- 2029 నాటికి అందుబాటులోకి అబుదాబి ‘స్ఫియర్’..!!
- హైదరాబాద్లో విదేశీ వర్సిటీలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!







