ప్లాస్టిక్ వేస్ట్ మీద పోరాటంలో ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి: ఎంఎంఈ
- June 29, 2021
దోహా: మినిస్ట్రీ ఆఫ్ మునిసిపాలిటీ అండ్ ఎన్విరాన్మెంట్ (ఎంఎంఈ), పౌరులు అలాగే నివాసితులంతా ప్లాస్టిక్ వేస్ట్ వ్యతిరేక పోరాటంలో కలిసి రావాలని పిలుపునిచ్చింది. ఈ మేరకు అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా విజ్నప్తి చేసింది ఎంఎంఈ. అంతర్జాతీయ ప్లాస్టిక్ బ్యాగ్ ఫ్రీ డే (3 జులై) నేపథ్యంలో మినిస్ట్రీ ఆఫ్ మునిసిపాలిటీ అండ్ ఎన్విరాన్మెంట్, ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ మీద పోరాటంపై తమ తమ సలహాలు, సూచనలను #FutureWithoutPlastic అనే హ్యాష్ ట్యాగ్ ద్వారా తెలియజేయాలని కోరింది. ప్రత్యేక కార్యక్రమం ద్వారా అందర్నీ ఈ ఉద్యమంలో భాగస్వాముల్ని చేయడమే కాకుండా, పార్టిసిపెంట్లకు బహుమతులు కూడా అందజేయనున్నారు. కాగా, ఖతార్ 2.5 మిలియన్ టన్నుల మునిసిపల్ సాలిడ్ వేస్ట్ ప్రతి ఏడాదీ ఉ్పత్తి చేస్తోంది. ఇందులో 8 శాతం మాత్రమే రీసైకిల్ జరుగుతోంది. కరోనా పాండమిక్ నేపథ్యంలో ఈ వేస్ట్ ఇంకా ఎక్కువగా ఉత్పత్తి అయినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో రీసైక్లింగ్ అలాగే వేస్టేజీని తగ్గించడంపై ఫోకస్ పెట్టాలని ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు తీర్మానిస్తున్నాయి.
తాజా వార్తలు
- భక్తులకు TTD కీలక అలర్ట్..
- రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ కీలక సమావేశం..
- వైజాగ్ లో ఇనార్బిట్ మాల్ ప్రారంభం..
- రేపు అమర జ్యోతి ఉమేష్ చంద్ర—60వ జయంతి
- రామ్ చరణ్ బర్త్డేకు అర్థవంతమైన కానుక ఇచ్చిన చిరంజీవి
- ఉక్రెయిన్–సౌదీ అరేబియా మధ్య రక్షణ సహకార ఒప్పందం
- ఏప్రిల్ 25న కొత్త పార్టీ పేరు ప్రకటించనున్న కవిత
- సివిలియన్ రక్షణ పై ఫోకస్..!!
- ప్రపంచవ్యాప్తంగా మూడో స్థానంలో జెద్దా ఎయిర్పోర్ట్..!!
- భారీ వర్షాలు..నీట మునిగిన ఇళ్లు, కార్లు..!!









