ఈ-గవర్నమెంట్ మొబైల్ అప్లికేషన్ ప్రారంభం
- June 30, 2021
మనామా: ఇన్ఫర్మేషన్ మరియు ఇ-గవర్నమెంట్ అథారిటీ (ఐజిఎ), క్రెడిమాక్స్ సంస్థతో కలిసి ఇ-గవర్నమెంట్ మొబైల్ అప్లికేషన్ విషయమై ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. ప్రభుత్వ ఎలక్ట్రానిక్ సేవల్ని అత్యాధునిక అంశాలను పొందుపర్చే ఈ అప్లికేషన్ అందుబాటులోకి వస్తోంది. ఈ కార్యక్రమానికి ఐజిఎ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మొహమ్మద్ అలి అల్ కయీద్, క్రెడిమాక్స్ సీఈఓ అహ్మద్ ఎ సయెది, ఐజిఎ డిప్యూటీ సీఈఓ, ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్మేషన్ డాక్టర్ జకారియా అహ్మద్ అల్ ఖజా, అలి అల్ మిషాల్ తదితరులు హాజరయ్యారు. పౌరులు అలాగే నివాసితులకు మెరుగైన సేవలు అందించే క్రమంలో ఈ అప్లికేషన్ అవసరం ఏర్పడింది. ఉన్నత స్థాయిలో భద్రత కలిగి వుండేలా ఈ అప్లికేషన్ రూపొందింది. అత్యంత వేగవంతమైన మరియు యూనిఫైడ్ పేమెంట్ సర్వీస్ కూడా అందిస్తుంది ఈ అప్లికేషన్. ప్రభుత్వ లావాదేవీల కోసం ఈ ఫీచర్ పొందుపరిచారు. ప్రభుత్వ నోటిఫికేషన్లను వినియోగదారులకు పంపించడం, అధికారిక డిజిటల్ డాక్యుమెంట్ పోర్టుఫోలియో, అపాయింట్మెంట్ బుకింగ్ సేవలు వంటివాటిని ఇందులో పొందుపరిచారు.
తాజా వార్తలు
- జెడ్డాలో ప్రారంభమైన జ్యువెలరీ ఎక్స్పోజిషన్..!!
- కువైట్ లో భారత రాయబారిగా పరమితా త్రిపాఠి..!!
- కార్మికుడికి Dh1.5 మిలియన్ల పరిహారం..!!
- ప్రాంతీయ పరిణామాలపై యూఎన్ సెక్రటరీ జనరల్ ఆరా..!!
- అమెరికా వైస్ ప్రెసిడెంట్ తో ఖతార్ పీఎం సమావేశం..!!
- పోలీసుల అదుపులో పలువురు మోటార్ సైక్లిస్టులు..!!
- బీసీసీఐ అధ్యక్షుడి రేస్ లో ప్రముఖ క్రికెటర్ లు?
- ఒమన్ పై పాక్ విజయం..
- భారత దేశం మొత్తం టపాసులు బ్యాన్..
- రష్యాలో భారీ భూకంపం