ఈ-గవర్నమెంట్ మొబైల్ అప్లికేషన్ ప్రారంభం
- June 30, 2021
మనామా: ఇన్ఫర్మేషన్ మరియు ఇ-గవర్నమెంట్ అథారిటీ (ఐజిఎ), క్రెడిమాక్స్ సంస్థతో కలిసి ఇ-గవర్నమెంట్ మొబైల్ అప్లికేషన్ విషయమై ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. ప్రభుత్వ ఎలక్ట్రానిక్ సేవల్ని అత్యాధునిక అంశాలను పొందుపర్చే ఈ అప్లికేషన్ అందుబాటులోకి వస్తోంది. ఈ కార్యక్రమానికి ఐజిఎ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మొహమ్మద్ అలి అల్ కయీద్, క్రెడిమాక్స్ సీఈఓ అహ్మద్ ఎ సయెది, ఐజిఎ డిప్యూటీ సీఈఓ, ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్మేషన్ డాక్టర్ జకారియా అహ్మద్ అల్ ఖజా, అలి అల్ మిషాల్ తదితరులు హాజరయ్యారు. పౌరులు అలాగే నివాసితులకు మెరుగైన సేవలు అందించే క్రమంలో ఈ అప్లికేషన్ అవసరం ఏర్పడింది. ఉన్నత స్థాయిలో భద్రత కలిగి వుండేలా ఈ అప్లికేషన్ రూపొందింది. అత్యంత వేగవంతమైన మరియు యూనిఫైడ్ పేమెంట్ సర్వీస్ కూడా అందిస్తుంది ఈ అప్లికేషన్. ప్రభుత్వ లావాదేవీల కోసం ఈ ఫీచర్ పొందుపరిచారు. ప్రభుత్వ నోటిఫికేషన్లను వినియోగదారులకు పంపించడం, అధికారిక డిజిటల్ డాక్యుమెంట్ పోర్టుఫోలియో, అపాయింట్మెంట్ బుకింగ్ సేవలు వంటివాటిని ఇందులో పొందుపరిచారు.
తాజా వార్తలు
- కువైట్లో నీటి శుద్ధీకరణ కేంద్రం పై దాడి..భారతీయ కార్మికుడు మృతి
- NRI టీడీపీ గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో టీడీపీ 44వ ఘనంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- మహిళను హత్య చేసి ఫ్రిజ్లో భద్రపరిచిన వ్యక్తి లొంగుబాటు
- తెలంగాణలో దంచికొడుతున్న ఎండలు..22 జిల్లాల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు
- మయామి ఓపెన్ విజేతగా జానిక్ సినర్
- ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ తెలిపిన EV సంస్థలు
- తన కారు డ్రైవర్ కుమారుడికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన విజయ్
- యూఏఈ పూర్తి సామర్థ్యంతో పనిచేస్తూ మరింత బలంగా ఆవిర్భవిస్తుంది: షేక్ మహమ్మద్
- దమ్మామ్, జుబైల్ పోర్టులలో ఫీజు మినహాయింపు పొడిగింపు..!!
- ప్రాంతీయ భద్రత, సముద్ర ముప్పులపై అరబ్ విదేశాంగ మంత్రుల చర్చలు..!!









