ఈ-గవర్నమెంట్ మొబైల్ అప్లికేషన్ ప్రారంభం
- June 30, 2021
            మనామా: ఇన్ఫర్మేషన్ మరియు ఇ-గవర్నమెంట్ అథారిటీ (ఐజిఎ), క్రెడిమాక్స్ సంస్థతో కలిసి ఇ-గవర్నమెంట్ మొబైల్ అప్లికేషన్ విషయమై ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. ప్రభుత్వ ఎలక్ట్రానిక్ సేవల్ని అత్యాధునిక అంశాలను పొందుపర్చే ఈ అప్లికేషన్ అందుబాటులోకి వస్తోంది. ఈ కార్యక్రమానికి ఐజిఎ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మొహమ్మద్ అలి అల్ కయీద్, క్రెడిమాక్స్ సీఈఓ అహ్మద్ ఎ సయెది, ఐజిఎ డిప్యూటీ సీఈఓ, ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్మేషన్ డాక్టర్ జకారియా అహ్మద్ అల్ ఖజా, అలి అల్ మిషాల్ తదితరులు హాజరయ్యారు. పౌరులు అలాగే నివాసితులకు మెరుగైన సేవలు అందించే క్రమంలో ఈ అప్లికేషన్ అవసరం ఏర్పడింది. ఉన్నత స్థాయిలో భద్రత కలిగి వుండేలా ఈ అప్లికేషన్ రూపొందింది. అత్యంత వేగవంతమైన మరియు యూనిఫైడ్ పేమెంట్ సర్వీస్ కూడా అందిస్తుంది ఈ అప్లికేషన్. ప్రభుత్వ లావాదేవీల కోసం ఈ ఫీచర్ పొందుపరిచారు. ప్రభుత్వ నోటిఫికేషన్లను వినియోగదారులకు పంపించడం, అధికారిక డిజిటల్ డాక్యుమెంట్ పోర్టుఫోలియో, అపాయింట్మెంట్ బుకింగ్ సేవలు వంటివాటిని ఇందులో పొందుపరిచారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్-భారత్ చర్చలు..వాణిజ్యం, భద్రత మరియు ప్రాంతీయ శాంతిపై దృష్టి..!!
 - బిగ్ టికెట్ డ్రాలో Dh25 మిలియన్ల గ్రాండ్ ప్రైజ్ను గెలుచుకున్న భారతీయ ప్రవాసుడు..!!
 - యూనిఫైడ్ GCC వీసాపై క్లారిటీ ఇచ్చిన సౌదీ పర్యాటక మంత్రి..!!
 - కువైట్ రైల్వే ప్రాజెక్ట్.. రైల్వే స్టేషన్ మొదటి దశ పూర్తి..!!
 - సముద్ర కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసిన ఖతార్..!!
 - ఒమన్ చోరీ కేసులలో పలువురి అరెస్టు..!!
 - తెలంగాణ: బస్సులో సీటు దొరకట్లేదన్న దిగులు వద్దు..
 - బ్రిటన్లో ఆరోగ్య రంగంలో నారాయణ హెల్త్ పెద్ద అడుగు!
 - ఏపీకి పెట్టుబడుల వెల్లువ..
 - ఎలక్ట్రిక్ యుగం వైపు ఏపీ—హిందూజా భాగస్వామ్యం!
 







