వైద్యులే ఇప్పుడు లోక రక్షకులు: టి.గవర్నర్
- July 01, 2021హైదరాబాద్:ప్రస్తుత కోవిడ్ సంక్షోభ సమయంలో అసమానమైన, నిస్వార్థ సేవలందిస్తున్న వైద్యులే ఇప్పుడు నిజమైన ప్రాణ, లోక రక్షకులు అని గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు.జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హైదరాబాద్ బ్రాంచ్ నిర్వహించిన వర్చువల్ సమావేశంలో గవర్నర్ ఈ రోజు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ కోవిడ్ మహమ్మారిపై పోరాటంలో ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ. . తమ జీవితాలను సైతం లెక్కచేయకుండా వైద్యులు లక్షలాదిమంది బాధితుల జీవితాలను రక్షిస్తున్నారు అని అన్నారు.వారి నిస్వార్ధమైన సేవలు, శ్రద్ధ, అంకితభావం లక్షలాది మంది ప్రాణాలను కాపాడుతున్నాయని గవర్నర్ వైద్యుల సేవలను కొనియాడారు.వైద్యుల దినోత్సవం వారికి కృతజ్ఞతలు చెప్పడానికి, వారి సేవలను గుర్తించి గౌరవించడానికి ఒక సరైన సమయం గా ఉంటుందని డాక్టర్ తమిళిసై అన్నారు.
తాను తన కుటుంబ సభ్యులు వైద్యు లే కావడం వల్ల.. వైద్య రంగంలో ఉన్న వారి ఆలోచనలు, బాధలు బాధ్యతలు అర్థం చేసుకోగలమని, వైద్యులకు తన సంపూర్ణ మద్దతు ఎప్పుడూ ఉంటుందని గవర్నర్ అన్నారు.భారతరత్న డాక్టర్ బీసీ రాయ్ జయంతిని జాతీయ వైద్యుల దినోత్సవం గా జరుపుకుంటున్న సందర్భంలో ఆయనకు గవర్నర్ నివాళులు అర్పించారు.
వైద్యులందరికీ ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ