భారత్, పాకిస్తాన్ తో సహా 14 దేశాలపై ట్రావెల్ బ్యాన్
- July 02, 2021
యూఏఈ: భారత్, పాకిస్తాన్ తో పాటు కోవిడ్ తీవ్రత ఎక్కువగా ఉండే దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధిస్తున్నట్లు యూఏఈ స్పష్టం చేసింది. ట్రావెల్ బ్యాన్ లిస్టులో ఉన్న దేశాలకు తమ పౌరులకు ప్రయాణించొద్దని, ఆయా దేశాల నుంచి ఎవరిని అనుమతించబోమని వెల్లడించింది. భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, వియత్నాం, నమీబియా, జాంబియా, డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఉగాండా, సియెర్రా లియోన్, లైబీరియా, దక్షిణాఫ్రికా, నైజీరియా దేశాలకు వెళ్లడాన్ని నిషేధించినట్లు విదేశీ వ్యవహారాల మరియు అంతర్జాతీయ సహకార మంత్రిత్వ శాఖ (మోఫాయిక్), జాతీయ అత్యవసర సంక్షోభ, విపత్తుల నిర్వహణ అథారిటీ (ఎన్సిఇఎంఎ) ప్రకటించాయి. అయితే..దౌత్య వ్యవహారలకు సంబంధించి ప్రయాణాలకు మినహాయింపు ఉంటుంది. అలాగే అత్యవసర చికిత్స, ప్రభుత్వ అధికారులు, బిజినెస్, టెక్నికల్ డెలిగేట్స్ కు కూడా మినహాయింపు ఉంటుంది.
తాజా వార్తలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!
- ప్రాంతీయ భద్రత అంశంలో భారత్కు బహ్రెయిన్ కృతజ్ఞతలు..!!
- మసీర్హా పోర్టులో అగ్నిప్రమాదం.. వేగంగా స్పందించిన ఫైర్ ఫైటర్స్..!!
- నకిలీ వస్తువుల కొనుగోలుపై యూఏఈ హెచ్చరిక..రూ.2.3 కోట్ల వరకు జరిమానా, జైలు శిక్ష..!!
- ఖతార్లో చక్కెర కలిపిన పానీయాలపై ఎక్సైజ్ పన్ను అమలు..!!
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..







