భారత్, పాకిస్తాన్ తో సహా 14 దేశాలపై ట్రావెల్ బ్యాన్

- July 02, 2021 , by Maagulf
భారత్, పాకిస్తాన్ తో సహా 14 దేశాలపై ట్రావెల్ బ్యాన్

యూఏఈ: భారత్, పాకిస్తాన్ తో పాటు కోవిడ్ తీవ్రత ఎక్కువగా ఉండే దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధిస్తున్నట్లు యూఏఈ స్పష్టం చేసింది. ట్రావెల్ బ్యాన్ లిస్టులో ఉన్న దేశాలకు తమ పౌరులకు ప్రయాణించొద్దని, ఆయా దేశాల నుంచి ఎవరిని అనుమతించబోమని వెల్లడించింది. భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, వియత్నాం, నమీబియా, జాంబియా, డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఉగాండా, సియెర్రా లియోన్, లైబీరియా, దక్షిణాఫ్రికా, నైజీరియా దేశాలకు వెళ్లడాన్ని నిషేధించినట్లు విదేశీ వ్యవహారాల మరియు అంతర్జాతీయ సహకార మంత్రిత్వ శాఖ (మోఫాయిక్), జాతీయ అత్యవసర సంక్షోభ, విపత్తుల నిర్వహణ అథారిటీ (ఎన్‌సిఇఎంఎ) ప్రకటించాయి. అయితే..దౌత్య వ్యవహారలకు సంబంధించి ప్రయాణాలకు మినహాయింపు ఉంటుంది. అలాగే అత్యవసర చికిత్స, ప్రభుత్వ అధికారులు, బిజినెస్, టెక్నికల్ డెలిగేట్స్ కు కూడా మినహాయింపు ఉంటుంది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com