ఎంపిక చేయబడ్డ యాత్రీకులకు టెక్స్ట్ మెసేజ్లు: హజ్ మినిస్ట్రీ
- July 02, 2021
రియాద్: మినిస్ట్రీ ఆఫ్ హజ్ మరియు ఉమ్రాహ్ - ఉమ్రా మరియు హజ్ వ్యవహారాల అసిస్టెంట్ అండర్ సెక్రెటరీ హిషామ్ సయీద్ మాట్లాడుతూ, ఈ ఏడాది హజ్ యాత్ర కోసం అర్హత పొందిన యాత్రీకుల ఎంపిక ప్రక్రియ ప్రారంభమయ్యిందని చెప్పారు. తొలి ఫేజ్లో 558,000 మంది డొమెస్టిక్ అప్లికెంట్స్ ఎలక్ట్రానిక్ పద్ధతిలో దరఖాస్తు చేసుకున్నారనీ, వీరిలో 51 శాతం మంది పురుషులు కాగా, 49 శాతం మంది మహిళలని తెలిపారు. పది రోజుల్లో ఈ అభ్యర్థనలను పరిశీలించడం జరిగిందని అన్నారు. అనుభవజ్ఞులైన యువతీ యువకులు ఈ మొత్తం కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారని పేర్కొన్నారు. అర్హత పొందిన యాత్రీకులకు టెక్స్ట్ మెసేజ్ వెళుతుందని ఆయన పేర్కొన్నారు. యాత్రీకులు, అవసరమైన అన్ని ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారాయన.
తాజా వార్తలు
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..









