ఎంపిక చేయబడ్డ యాత్రీకులకు టెక్స్ట్ మెసేజ్లు: హజ్ మినిస్ట్రీ
- July 02, 2021
రియాద్: మినిస్ట్రీ ఆఫ్ హజ్ మరియు ఉమ్రాహ్ - ఉమ్రా మరియు హజ్ వ్యవహారాల అసిస్టెంట్ అండర్ సెక్రెటరీ హిషామ్ సయీద్ మాట్లాడుతూ, ఈ ఏడాది హజ్ యాత్ర కోసం అర్హత పొందిన యాత్రీకుల ఎంపిక ప్రక్రియ ప్రారంభమయ్యిందని చెప్పారు. తొలి ఫేజ్లో 558,000 మంది డొమెస్టిక్ అప్లికెంట్స్ ఎలక్ట్రానిక్ పద్ధతిలో దరఖాస్తు చేసుకున్నారనీ, వీరిలో 51 శాతం మంది పురుషులు కాగా, 49 శాతం మంది మహిళలని తెలిపారు. పది రోజుల్లో ఈ అభ్యర్థనలను పరిశీలించడం జరిగిందని అన్నారు. అనుభవజ్ఞులైన యువతీ యువకులు ఈ మొత్తం కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారని పేర్కొన్నారు. అర్హత పొందిన యాత్రీకులకు టెక్స్ట్ మెసేజ్ వెళుతుందని ఆయన పేర్కొన్నారు. యాత్రీకులు, అవసరమైన అన్ని ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారాయన.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్చుక్ సంచలన పోస్ట్!







