ఎక్స్పో 2020: ఆయా దేశాల జాతీయ దినోత్సవ వేడుకలు వీక్షించే అవకాశం
- July 02, 2021
యూఏఈ: ఆరు నెలలపాటు జరిగే ఎక్స్పో 2020లో ఆయా దేశాలకు సంబంధించి జాతీయ దినోత్సవ వేడుకల్ని తిలకించే అవకాశం సందర్శకులకు కలగనుంది. అల్ వసల్ ప్లాజా ఈ వేడుకలకు వేదిక కానుంది. ఆయా దేశాలకు చెందిన జాతీయ పతాకాలు, జాతీయ గీతాలను ప్రదర్శించేందుకు అవకాశం వుంది. తమ తమ సాంస్కృతిక కార్యకలాపాలతో ఈ వేడుకలకు కొత్త శోభను అద్దనున్నారు ఆయా దేశాల ప్రతినిథులు. ఆయా జాతీయ దినోత్సవాల్ని నిర్వహించడానికి సాంకేతికంగా వీలుపడనివారు, హానర్ డే నిర్వహించుకునేందుకు వీలు పొందుతారు. ఒకే రోజు నేషనల్ డే, హానర్ డే వుంటే, ఉదయం ఒక వేడుక, సాయంత్రం ఇంకో వేడుక నిర్వహించుకోవచ్చు. 191 దేశాలకు చెందిన కళాకారులు ఈ ఎక్స్పోలో పాల్గొంటారు. క్రిస్మస్, న్యూ ఇయర్, దివాలీ, చైనా కొత్త సంవత్సర వేడుకలు.. ఇలా చాలా ప్రత్యేకమైన వేడుకలు ఈ ఎక్స్పోలో అలరించనున్నాయి.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్చుక్ సంచలన పోస్ట్!







