ఎక్స్పో 2020: ఆయా దేశాల జాతీయ దినోత్సవ వేడుకలు వీక్షించే అవకాశం
- July 02, 2021
యూఏఈ: ఆరు నెలలపాటు జరిగే ఎక్స్పో 2020లో ఆయా దేశాలకు సంబంధించి జాతీయ దినోత్సవ వేడుకల్ని తిలకించే అవకాశం సందర్శకులకు కలగనుంది. అల్ వసల్ ప్లాజా ఈ వేడుకలకు వేదిక కానుంది. ఆయా దేశాలకు చెందిన జాతీయ పతాకాలు, జాతీయ గీతాలను ప్రదర్శించేందుకు అవకాశం వుంది. తమ తమ సాంస్కృతిక కార్యకలాపాలతో ఈ వేడుకలకు కొత్త శోభను అద్దనున్నారు ఆయా దేశాల ప్రతినిథులు. ఆయా జాతీయ దినోత్సవాల్ని నిర్వహించడానికి సాంకేతికంగా వీలుపడనివారు, హానర్ డే నిర్వహించుకునేందుకు వీలు పొందుతారు. ఒకే రోజు నేషనల్ డే, హానర్ డే వుంటే, ఉదయం ఒక వేడుక, సాయంత్రం ఇంకో వేడుక నిర్వహించుకోవచ్చు. 191 దేశాలకు చెందిన కళాకారులు ఈ ఎక్స్పోలో పాల్గొంటారు. క్రిస్మస్, న్యూ ఇయర్, దివాలీ, చైనా కొత్త సంవత్సర వేడుకలు.. ఇలా చాలా ప్రత్యేకమైన వేడుకలు ఈ ఎక్స్పోలో అలరించనున్నాయి.
తాజా వార్తలు
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..









