శ్రీవారి ఆన్లైన్ టికెట్లను ఇప్పట్లో పెంచేది లేదు..
- July 03, 2021
తిరుమల: కరోనా వైరస్ తీవ్రత ఇంకా కొసాగుతూనే ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో తిరుమల శ్రీవారి ఆన్లైన్ టికెట్లను పెంచే ఉద్దేశం లేదని టీటీడీ పేర్కొంది. కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన తర్వాతే దీని గురించి ఆలోచిస్తామని టీటీడీ స్పెసిఫైడ్ అథారిటీ చైర్మన్, ఈవో కేఎస్ జవహర్రెడ్డి స్పష్టం చేశారు. దీంతో సర్వదర్శనం కోసం సామాన్య భక్తులు మరికొంత కాలం వేచి చూడక తప్పేలా కనిపించడం లేదు.
మరోవైపు,శ్రీవారి జిలేబీ, మురుకుల ప్రసాదం ధరలను టీటీడీ పెంచింది. శ్రీవారికి ప్రతి గురువారం నిర్వహించే తిరుప్పావడ సేవ సమయంలో జిలేబీతోపాటు మురుకులను నివేదిస్తుంటారు. తిరుప్పావడ టికెట్లు కొనుగోలు చేసి శ్రీవారి సేవలో పాల్గొనే భక్తులకు వీటిని ఇస్తుంటారు. వీటికి డిమాండ్ ఎక్కువగా ఉండడంతో రూ. 100గా ఉన్న ధరను రూ. 500కు పెంచింది. కాగా, చిన్న, పెద్ద లడ్డూలు, వడల ధరలను టీటీడీ ఇప్పటికే పెంచింది.
తాజా వార్తలు
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ
- బహ్రెయిన్లో న్యాయ సేవలకు ఈ-పేమెంట్ సర్వీస్..!!
- ఒమన్లో విద్యుత్ కేబుళ్ల చోరీ.. నలుగురి అరెస్టు..!!
- కువైట్లో కార్మికుల హక్కులకు మరింత రక్షణ..!!
- 2029 నాటికి అందుబాటులోకి అబుదాబి ‘స్ఫియర్’..!!
- హైదరాబాద్లో విదేశీ వర్సిటీలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!







