2021 ఫస్టాఫ్ లో 8000 మంది ప్రవాసీయులను పంపేసిన కువైట్
- July 05, 2021
కువైట్: వివిధ కారణాలు, నేరాలతో 2021 తొలి అర్ధ సంవత్సరంలో 8000 మంది ప్రవాసీయులను దేశం నుంచి పంపివేసినట్లు కువైట్ వెల్లడించింది. ఇందులో 7,808 మంది ఇప్పటికే దేశం విడిచి వెళ్లినట్లు అంతర్గత మంత్రిత్వ శాక వెల్లడించింది. వాళ్లంతా రెసిడెన్సీ చట్టాలను ఉల్లంఘించటం, వివిధ నేరాలకు పాల్పడటం, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించటం వంటి నేరాలకు పాల్పటంతో వాళ్లపై దేశబహిష్కరణ వేటు పడినట్లు అధికారులు వెల్లడించారు. మరో 700 మంది దేశ విడిచి వెళ్లేందుకు డిపార్టేషన్ సెంటర్స్ లో వేచి చూస్తున్నారు. వీళ్లలో ఎక్కువ మంది శ్రీలంక, వియత్నాం పౌరులని అధికారులు వివరించారు. ప్రస్తుతం శ్రీలంక, వియత్నాం విమానాశ్రయాలు మూతపడటంతో వాళ్లు వేచి చూడాల్సి వస్తుందని అన్నారు. దేశ శాంతి భద్రతలను కాపాడేందుకు సెక్యూరిటీ క్యాంపేన్ లు కొనసాగుతాయని.. పౌరులు, ప్రవాసీయులు భద్రతాధికారులతో సహకరించాలని అధికారులు కోరారు
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్చుక్ సంచలన పోస్ట్!







