భారత్ కరోనా అప్డేట్

- July 05, 2021 , by Maagulf
భారత్ కరోనా అప్డేట్

న్యూ ఢిల్లీ: భారత్ లో క‌రోనా కేసులు క్ర‌మంగా త‌గ్గుతున్నాయి.  మార్చి, ఏప్రిల్ నెలల్లో భారీ సంఖ్య‌లో  కేసులు న‌మోద‌వ్వ‌గా, మే చివ‌రి వారం నుంచి పాజిటీవ్ కేసుల సంఖ్య క్ర‌మంగా త‌గ్గుతూ వ‌స్తున్న‌ది.తాజాగా, కేంద్రం క‌రోనా బులిటెన్‌ను విడుదల చేసింది.దీని ప్ర‌కారం, ఇండియాలో కొత్త‌గా 39,796 కేసులు న‌మోద‌య్యాయి.దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన మొత్తం కేసుల సంఖ్య 3,05,85,229 కి చేరింది.ఇందులో 2,97,00,430 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 4,82,071యాక్టీవ్ కేసులు ఉన్నాయి.ఇక గ‌డిచిన 24 గంట‌ల్లో భారత్ లో క‌రోనాతో 723 మంది మృతి చెందారు.దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో క‌రోనాతో మృతి చెందిన‌ వారి సంఖ్య 4,02,728కి చేరింది.భారత్ లో ఇప్ప‌టి వ‌ర‌కు 35,28,92,046 మందికి వ్యాక్సిన్ అందించిన‌ట్టు కేంద్ర ఆరోగ్య‌శాఖ బులిటెన్‌లో పేర్కొన్న‌ది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com