కోవిడ్ 19: వారం రోజుల్లో ఐసీయూ కేసుల్లో 10 శాతం పెరుగుదల

- July 05, 2021 , by Maagulf
కోవిడ్ 19: వారం రోజుల్లో ఐసీయూ కేసుల్లో 10 శాతం పెరుగుదల

కువైట్: కోవిడ్ 19కి సంబంధించి గత వారం రోజుల్లో 10 శాతం పెరుగుదల ఐసీయూ కేసుల్లో నమోదయ్యింది. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ ఈ విషయాన్ని వెల్లడించింది. జులై 4న నాటికి ఐసీయూలో 301 మంది కోవిడ్ బాధితులు వైద్య చికిత్స పొందుతున్నారు. కాగా,ఐసీయూ వార్డుల్లో చికిత్స పొందుతున్న కోవిడ్ బాధితుల సంఖ్యలో 9 శాతం పెరుగుదల నమోదయ్యింది. వీరి సంఖ్య 1,078గా వుంది. కాగా, ఇప్పటిదాకా 2,375,455 డోసుల కోవిడ్ 19 వ్యాక్సిన్ అందించడం జరిగిందని మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ పేర్కొంది. వీరిలో 923,307 మందికి రెండు డోసులూ పూర్తయ్యాయి. 1,452,148 మంది సింగిల్ డోస్ పూర్తి చేసుకున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com