ఏపీ కరోనా అప్డేట్
- July 05, 2021అమరావతి: ఆంధ్రప్రదేశ్ కరోనా కేసులు సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది.రాష్ట్ర వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం..గత 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 72,731 సాంపిల్స్ పరీక్షించగా..2,100 మందికి పాజిటివ్గా తేలింది.మరో 21 మంది కోవిడ్ బాధితులు మృతి చెందారు.తాజా మృతుల్లో చిత్తూరు, కృష్ణా జిల్లాల్లో ఐదుగురు చొప్పున, తూర్పు గోదావరిలో నలుగురు, ప్రకాశం జిల్లాలో ముగ్గురు, అనంతపూర్, గుంటూరు, నెల్లూరులో ఇద్దరు చొప్పున, శ్రీకాకుళం, విశాఖపట్నం,పశ్చిమ గోదావరిలో ఒక్కొక్కరు ఉన్నారు.ఇక, ఇదే సమయంలో 3,435 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు.రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 19,05,023కి పెరగగా..కోలుకున్నవారి సంఖ్య 18,58,189కి చేరింది.ఇప్పటి వరకు కోవిడ్ బారినపడి 12,870 మంది మృతి చెందితే.. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 33,964 యాక్టివ్ కేసులు ఉన్నాయని..నేటి వరకు 2,24,35,809 సాంపిల్స్ పరీక్షించామని బులెటిన్లో పేర్కొంది ప్రభుత్వం.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?