తెలంగాణలో కరోనా కేసుల వివరాలు
- July 05, 2021హైదరాబాద్: తెలంగాణలో కరోనా పాజిటివ్ రోజువారి కేసుల సంఖ్య ఎనిమిది వందలకు చేరువైంది.రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం..గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,03,398 సాంపిల్స్ పరీక్షించగా.. 808 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.మరో ఏడుగురు కోవిడ్ బాధితులు మృత్యువాతపడ్డారు.. ఇదే సమయంలో 1,061 మంది కరోనా నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారు.దీంతో..తెలంగాణలో ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 6,27,498కు చేరగా..రికవరీ కేసులు 6,12,096గా పెరిగాయి.ఇక, మృతుల సంఖ్య 3,698కి పెరిగింది.తెలంగాణలో రికవరీ రేటు 97.54 శాతంగా ఉందని పేర్కొంది ప్రభుత్వం.ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 11,704 యాక్టివ్ కేసులు ఉన్నాయి..తాజా కేసుల్లో అత్యధికంగా GHMC పరిధిలో 82 కేసులు వెలుగుచూడగా..నల్గొండలో 62, ఖమ్మంలో 59, కరీంనగర్లో 58, మంచిర్యాలలో 51, పెద్దపల్లిలో 50 కేసులు నమోదు అయ్యాయి.
తాజా వార్తలు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్
- ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్టు
- బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసే ఐదు సులభమైన మార్గాలు
- పలు రాష్ట్రాలకు వర్ష సూచన
- ఎన్నారై తెలుగుదేశం కువైట్ ఆధ్వర్యంలో కువైట్లో విస్తృత ప్రచారం
- అబుదాబి బుక్ ఫెయిర్.. ఉచిత ప్రవేశం ఇలా పొందండి
- యుద్ధ విమానం నడిపిన కృత్రిమ మేధ
- యూఏఈలో 3శాతం పెరిగిన ప్రమాద మరణాలు
- సకాలంలో జీతాలు చెల్లించని కంపెనీలకు తీవ్ర హెచ్చరిక