ఈ నెల 17వరకు బంగారు దుకాణాలు బంద్
- March 09, 2016
అఖిల భారత రత్నాలు, ఆభరణాల వాణిజ్య సమాఖ్య (జెమ్స్ అండ్ జువెల్లర్స్ ఫెడరేషన్-జీజేఎఫ్) పిలుపు మేరకు పాతబస్తీలోని బంగారం వ్యాపారస్తుల బంద్ ఈనెల 17 వరకు కొనసాగనుంది. ఈ నెల 2వ తేదీన ప్రారంభమైన బంద్ మొదట్లో మూడు రోజుల వరకు మాత్రమేనని ప్రకటించారు.కాగా, కేంద్ర ప్రభుత్వం వీరి సమస్యలను పరిష్కరించడానికి ముందుకు రాకపోవడంతో ఈ నెల 7వ తేదీ వరకు బంద్ను పొడిగించారు. అప్పటికీ... ఎలాంటి పరిష్కారం లభించకపోవడంతో ఈ నెల 17వ తేదీ వరకు ఆందోళన కొనసాగించాలని జీజేఎఫ్ నిర్ణయించింది. ఇందులో భాగంగా బుధవారం కూడా పాతబస్తీలోని బంగారం వ్యాపారస్తులు బంద్ పాటించారు. 2016-17 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్లో ఒక శాతం ఎక్సైజ్ సుంకం విధింపును పాతబస్తీ బంగారు ఆభరణాల వ్యాపారులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







