పూర్తిగా నిండిపోయిన ఆసుపత్రులు: ప్రమాదకర పరిస్థితిపై హెచ్చరించిన అథారిటీస్

- July 06, 2021 , by Maagulf
పూర్తిగా నిండిపోయిన ఆసుపత్రులు: ప్రమాదకర పరిస్థితిపై హెచ్చరించిన అథారిటీస్

కువైట్: కోవిడ్ ఇన్ఫెక్షన్ కేసులు పెరుగుతుండడంతో, ఆసుపత్రులు పూర్తిస్థాయిలో నిండిపోతున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. దేశంలో ప్రమాదకర పరిస్థితులు కనిపిస్తున్నాయని అధారిటీస్ చెబుతున్నాయి. జబెర్ ఆసుపత్రిలో ప్రతిరోజూ 160 మంది కోవిడ్ బాధితులు చేరుతున్నారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు వీలున్న మార్గాల్ని అథారిటీస్ అన్వేషిస్తున్నాయి. కోవిడ్ బాధితుల కోసం ప్రత్యేకంగా భవనాల్ని కేటాయించడంతోపాటు, కోవిడ్ నిబంధనలు మరింత ఖచ్చితంగా అమలయ్యేందుకు తగిన చర్యలు చేపట్టనున్నారు. ప్రైవేటు సెక్టార్ ఆసుపత్రుల్ని కూడా ఉపయోగించుకునేలా అథారిటీస్ పావులు కదుపుతున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com