రష్యాలో పెరుగుతున్న డెల్టా కేసులు.. రికార్డుస్థాయిలో మరణాలు
- July 06, 2021
మాస్కో: రష్యాలో నేడు రికార్డుస్థాయిలో కరోనా మరణాలు నమోదయ్యాయి. గత 24 గంటల వ్యవధిలో 737 మంది మరణించారు. ఈ స్థాయిలో మరణాలు నమోదు కావడం దేశంలో ఇదే తొలిసారి. కరోనాతో విలవిల్లాడిన తొలి ఐదు దేశాల్లో రష్యా కూడా ఒకటి. ప్రస్తుతం డెల్టా వేరియంట్ తన ప్రతాపాన్ని చూపుతోంది. కరోనాకు కేంద్రంగా ఉన్న మాస్కోలో నమోదవుతున్న మొత్తం కేసుల్లో 90 శాతం డెల్టా వేరియంట్కు సంబంధించినవేనని నగర మేయర్ సెర్గేయి సోబ్యానిన్ తెలిపారు.
వ్యాక్సిన్ వేసుకోని ఉద్యోగుల్లో మూడొంతుల మందిని ఇంటికి పంపాలని కార్యాలయాలను మేయర్ ఆదేశించారు. అలాగే టీకాలు తీసుకున్న వారిని, గత ఆరు నెలల్లో కరోనా బారినపడి కోలుకున్న వారిని మాత్రమే అనుమతించాలని రెస్టారెంట్లను కోరారు. ఆగస్టు మధ్యనాటికి సేవారంగంలో ఉన్న వారిలో 60 శాతం పూర్తిగా టీకాలు తీసుకుని ఉండాలని పేర్కొన్నారు. కాగా, సెప్టెంబరు నాటికి దేశంలోని 60 శాతం మందికి టీకాలు పూర్తిచేయాలని ప్రభుత్వం భావిస్తోంది. రష్యాలో ఇప్పటి వరకు 1,39,316 మంది కరోనాతో మరణించారు. యూరప్లో అత్యధిక కరోనా మరణాలు నమోదైంది రష్యాలోనే.
తాజా వార్తలు
- 2029 నాటికి అందుబాటులోకి అబుదాబి ‘స్ఫియర్’..!!
- హైదరాబాద్లో విదేశీ వర్సిటీలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!
- ప్రాంతీయ భద్రత అంశంలో భారత్కు బహ్రెయిన్ కృతజ్ఞతలు..!!
- మసీర్హా పోర్టులో అగ్నిప్రమాదం.. వేగంగా స్పందించిన ఫైర్ ఫైటర్స్..!!
- నకిలీ వస్తువుల కొనుగోలుపై యూఏఈ హెచ్చరిక..రూ.2.3 కోట్ల వరకు జరిమానా, జైలు శిక్ష..!!
- ఖతార్లో చక్కెర కలిపిన పానీయాలపై ఎక్సైజ్ పన్ను అమలు..!!
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ







