ఏపీలో కరోనా కేసుల వివరాలు

- July 08, 2021 , by Maagulf
ఏపీలో కరోనా కేసుల వివరాలు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య భారీగా తగ్గిపోయింది. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్‌ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 91,070 సాంపిల్స్ పరీక్షించగా… 2,982 మందికి పాజిటివ్‌గా తేలింది.. మహమ్మారితో మరో 27 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదే, సమయంలో రాష్ట్రవ్యాప్తంగా 3,461 మంది కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది ప్రభుత్వం. దీంతో.. మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 19,14,213కు చేరుకోగా… రికవరీ కేసులు 18,69,417కు పెరిగింది.. ఇక, ఇప్పటి వరకు కోవిడ్‌తో 12,946 మంది మృతి చెందగా… ప్రస్తుతం రాష్ట్రంలో 31,850 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com