వాహనాల్లో ప్రయాణీకులందరికీ సీట్ బెల్ట్ తప్పనిసరి
- July 08, 2021
యూఏఈ: వాహనాల్లో వెళుతున్నప్పుడు సీటు బెల్టు ధరించకపోతే 400 దిర్హాములు జరిమానా చెల్లించాల్సి వుంటుంది. నాలుగు బ్లాక్ పాయింట్లు అలాగే లైసెన్స్ రద్దు కూడా తప్పకపోవచ్చు. వాహనంలో ప్రతి ప్రయాణీకుడు కూడా సీటు బెల్ట్ పెట్టుకోవాల్సిందే. కాగా, ఆటోమేటెడ్ విధానం ద్వారా వాహనాల్లో ఉల్లంఘనల్ని గుర్తించనున్నట్లు అధికారులు గతంలోనే వెల్లడించారు. మొబైల్ ఫోన్ వాడుతూ డ్రైవింగ్ చేయడం వంటి వాటిని ఈ విధానం గుర్తిస్తుంది. హై రిజల్యూషన్ చిత్రాలతో ఉల్లంఘనుల్ని ఇట్టే పట్టేస్తారు. సీటు బెల్టు ధరిస్తే, రోడ్డు ప్రమాదాల్లో మరణాల శాతం సగానికి తగ్గే అవకాశముంటుంది. ఇది ముందు సీట్లలోనివారికి. వెనక సీట్లలో వారికి 25 నుంచి 75 శాతం వరకు రిస్క్ తగ్గుతుంది.
తాజా వార్తలు
- ఎన్ఆర్ఐ సర్టిఫికెట్ల కోసం అత్యవసర సేవలు.. దుబాయ్లోని భారత కాన్సులేట్ కీలక ప్రకటన..!!
- ఖతార్లో మరో మూడు సంవత్సరాల పాటు ONE ఛాంపియన్షిప్ పోటీలు..!!
- షైఖ్ ఇసా బిన్ సల్మాన్ బ్రిడ్జిపై రాకపోకలపై ఆంక్షలు..!!
- సముద్ర భద్రత, నౌకాయాన స్వేచ్ఛకు ఒమాన్ మద్దతు..!!
- సౌదీలో కొత్త జనరల్ ఎడ్యుకేషన్ చట్టానికి ఆమోదం..!!
- సౌదీలో సాటా నైట్ క్రికెట్ టోర్నమెంట్ ఘన విజయం..
- 45 రోజుల పాటు దుబాయ్ ఎయిర్పోర్ట్ ట్రాన్సిట్లో దాక్కున్న డ్రగ్స్ స్మగ్లర్ అరెస్ట్..!!
- దుబాయ్ 'ఇన్వైట్' పథకానికి భారీ స్పందన..48 గంటల్లో 10 వేలకుపైగా దరఖాస్తులు
- బార్డర్ ఎగ్జిట్ రూల్స్, ట్రాఫిక్ ఫైన్స్ పై కువైట్ క్లారిటీ..!!
- హర్మూజ్లో ఉద్రిక్తత..భారతీయ సిబ్బంది ఉన్న గ్యాస్ ట్యాంకర్ లక్ష్యంగా దాడి







