ఏపీ కరోనా అప్డేట్

- July 10, 2021 , by Maagulf
ఏపీ కరోనా అప్డేట్

అమరావతి: ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో రెండు వేల 925 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 26 మంది కరోనాతో మరణించారు. రాష్ర్టంలో ఇప్పటి వరకు 19 లక్షల 20 వేల 178 మంది వైరస్ బారీన పడినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. మృతుల సంఖ్య 12 వేల 986కు చేరుకున్నది. ఇక రాష్ర్ట వ్యాప్తంగా ఇప్పటి వరకు 18 లక్షల 77 వేల 930 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 29,262 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,28,94,611 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది. అత్యధికంగా చిత్తూరు, కృష్ణా జిల్లాల్లో ఐదుగురు చొప్పున ప్రాణాలో కోల్పోయారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com