మహిళా ఉద్యోగులకు ఎయిర్ టెల్ భారీ నజరానా ...
- March 09, 2016
తన సంస్థ మహిళా ఉద్యోగులకు మొబైల్ రంగానికి చెందిన ప్రముఖ సంస్థ భారతీ ఎయిర్ టెల్ భారీ నజరానా ప్రకటించింది. మహిళా ఉద్యోగులకు ఆ సంస్థ ఇచ్చే ప్రసూతి సెలవులను అమాంతం పెంచేసింది. ఇప్పటి వరకు ఆ సంస్థ మహిళా ఉద్యోగులకు 12 వారాలపాటు ప్రసూతి సెలవులు ఇవ్వగా ప్రస్తుతం 22 వారాలకు పెంచింది. తల్లిగా మారనున్న స్త్రీలపై మానసిక ఒత్తిడి తగ్గించడంతోపాటు వారు మాతృత్వాన్ని పూర్తిగా ఆస్వాధించేందుకు అవకాశం కల్పించినట్లవుతుందని ప్రకటించింది.దీంతోపాటు ఇప్పటికే గుర్గావ్ లోని తమ కంపెనీ పిల్లల సురక్షిత బాధ్యతలు కూడా ప్రారంభించిందని పేర్కొంది. ఒక వేళ పిల్లలను దత్తతకు తీసుకుంటే ఆ దత్తత తీసుకునే పిల్లల వయసు రెండేళ్లలోపు ఉంటే ప్రసూతి సెలవులు వర్తిస్తాయని, వారికి పన్నెండు వారాలు ఇవ్వడం జరుగుతుందని, అదే రెండేళ్ల వయసు పైబడిన పిల్లలైతే. ఆరు వారాల ప్రసూతి సెలవులు లభిస్తాయని చెప్పారు. పురుష ఉద్యోగులకు అయితే వారం రోజులపాటు సెలవులు తీసుకునే అవకాశం ఉంటుందని కూడా తెలిపింది.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







