ఒమన్-సౌదీ సమన్వయ మండలి ఏర్పాటుకు MOU
- July 12, 2021
సౌదీ: పరస్పర ప్రయోజనాలు, అభివృద్ధి లక్ష్యంగా ఒమన్-సౌదీ సమన్వయ మండలి(కోఆర్డినేషన్ కౌన్సిల్) ఏర్పాటు చేస్తూ ఇరు దేశాలు అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. సౌదీ రాజు సల్మాన్ బిన్ అబ్దులాజీజ్ అల్-సౌద్, ఒమన్ సుల్తాన్ హైతం బిన్ తారిక్ ఆధ్వర్యంలో అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ మేరకు ఒమన్ విదేశాంగ శాఖ మంత్రి సయ్యద్ బదర్ బిన్ హమద్ అల్ బుసైది, సౌదీ ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్ అల్-సౌద్ ఈ అవగాహన ఒప్పందంపై సంతకం చేశారు. ఈ ఒప్పందం మేరకు రెండు దేశాల మధ్య సమైక్యతను మరింత బలోపేతం చేయటంతో పాటు ఇప్పటికే చేపట్టిన జాయింట్ ప్రాజెక్టులను ఈ సమన్వయ మండలి ప్రమోట్ చేయనుంది. అంతేకాదు రెండు దేశాల ప్రయోజనాలు చేకూర్చేలా సమన్వయ మండలి ఆధ్వర్యంలో మరిన్ని ఒప్పందాలకు అవకాశాలుంటాయి.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్చుక్ సంచలన పోస్ట్!







