వ్యాక్సినేషన్ సెంటర్కి కాలినడకన, బైక్ మీద వచ్చే వారికి నో ఎంట్రీ
- July 12, 2021ఖతార్: పారిశ్రామిక రంగం, వ్యాపార రంగాల్లోని సిబ్బందికి వ్యాక్సిన్ అందించే లక్ష్యంతో వ్యాక్సినేషన్ కేంద్రాన్ని తిరిగి ప్రారంభించినట్లు ఖతార్ వెల్లడించింది. ఇవాళ్టి (జులై 12) నుంచి వ్యాక్సినేషన్ సెంటర్ ప్రారంభం అవుతోంది. ప్రపంచంలోని అతి పెద్ద వ్యాక్సినేషన్ సెంటర్లలో ఇదీ కూడా ఒక్కటి. ప్రతిరోజు 25 వేల మందికి వ్యాక్సిన్ అందించవచ్చు. అయితే..ఈ వ్యాక్సిన్ సెంటర్ కు వచ్చే వారు కాలినడకన, బైక్ ల మీద రావొద్దని వ్యాక్సినేషన్ సెంటర్ నిర్వాహకులు సూచించారు. కాలినడకన, బైక్ ల మీద వచ్చే వారికి అనుమతి ఉండదని స్పష్టం చేసింది. వీకెండ్లో వీలైనంత ఎక్కువ మందికి వ్యాక్సిన్ అందించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. కంపెనీలు తమ సిబ్బందికి వ్యాక్సిన్ షెడ్యూల్ ఖారారు చేసేందుకు [email protected] కు మెయిల్ చేయాలని కోరారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్
- దుబాయ్ బిజినెస్ బే నుండి మెట్రో స్టేషన్లకు నేరుగా బస్సులు
- KAPP డైరెక్టర్ తో భారత రాయబారి కీలక భేటీ..!
- దుబాయ్ లో సులువుగా 6 ఆన్-ది-గో పోలీసు సేవలు
- సౌదీలో మే మొదటి వారంలో 19,710 మంది అరెస్ట్
- ఓటు వేసిన చంద్రబాబు, జగన్
- మస్కట్ ఎక్స్ప్రెస్ వే మూసివేత
- అల్ షిందాఘా కారిడార్..104 నుండి 16 నిమిషాలకు తగ్గనున్న ట్రావెల్ టైం
- ఓటింగ్ సరళి విపరీతంగా పెరిగే అవకాశం!
- తిరిగి విధుల్లో చేరిన ఎయిరిండియా ఎక్స్ప్రెస్ క్యాబిన్ సిబ్బంది!