మాస్క్ ధరించకుంటే రూ.100 జరిమానా
- July 12, 2021అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈరోజు కరోనా కేసులు, వ్యాక్సినేషన్ తదితర విషయాలపై సమీక్షాసమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి మంత్రి ఆళ్ల నానితో పాటుగా ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కరోనా ఆంక్షలను కఠినంగా అమలు చేయాలని ఆదేశించారు.ప్రతి దుకాణంలో పనిచేసే వ్యక్తులు, వినియోగదారులు అందరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాల్సిందేనని తెలిపారు. మాస్క్ లేకుంటే రూ.100 జరిమాన విధించాలని ఆదేశించారు.అవసరమైతే కొన్ని రోజులపాటు దుకాణాలు మూసివేసేలా ఆదేశాలు జారీ చేస్తామని హెచ్చరించారు.
రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సడలింపులు ఇస్తున్నట్టు జగన్ పేర్కొన్నారు.రాత్రి 9 వరకు దుకాణాలు మూసివేయాలని అన్నారు.రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగుతుందని అన్నారు. సడలింపుల సమయంలో 144 సెక్షన్ అమలు చేస్తున్నట్టు తెలిపారు.మాస్క్ పెట్టుకొకుండా తిరిగేవారిని గుర్తించేందుకు వాట్సప్ నెంబర్ అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.ఎవరైనా మాస్క్ పెట్టుకొనని వ్యక్తి ఫొటోను వాట్సప్కు పంపితే వారికి జరిమానా విధించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్షిప్ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు