గిరిజనుల సమక్షంలో రెండో డోసు వ్యాక్సిన్ తీసుకున్న తెలంగాణ గవర్నర్
- July 12, 2021హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ తమిళిసై గిరిజనులతో కలిసి వ్యాక్సిన్ తీసుకున్నారు.ఇవ్వాళ ఆమె రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని కె.సి. తండాలో గిరిజనుల సమక్షంలో రెండో డోసు తీసుకున్నారు. గిరిజన గ్రామాలు, తండాల్లో వ్యాక్సినేషన్ తక్కువగా జరుగుతోందని, వారిలో భయాలను పోగొట్టేందుకే తాను వారి సమక్షంలో వ్యాక్సిన్ వేసుకున్నానని చెప్పారు.
తండాల్లో వ్యాక్సినేషన్ లో వేగం పెంచాలని అధికారులకు సూచించారు. ఇలాంటి పరిస్థితుల్లో మనకు ఆయుధం వ్యాక్సినే అన్నారు. మన దేశంలో తయారైన వ్యాక్సిన్ ను తీసుకోవడం గర్వకారణమని, సొంత వ్యాక్సిన్ తో ప్రపంచానికి ఆదర్శంగా నిలిచామని అన్నారు. కరోనా నియంత్రణ, వ్యాక్సినేషన్ లో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు బాగున్నాయని ఆమె అభినందించారు. గిరిజనుల్లో అవగాహన పెంచడానికి గవర్నర్ వారి సమక్షంలోనే వ్యాక్సిన్ తీసుకోవడం అభినందనీయమని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. గిరిజన మహిళల్లో ఉన్న భయాలను తొలగించేందుకే ఆమె వచ్చారన్నారు.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు