భారత్ లో కరోనా కేసుల వివరాలు
- July 14, 2021న్యూ ఢిల్లీ: భారత్ లో క్రమంగా కరోనా కేసులు తగ్గుతున్నాయి. వేగంగా వ్యాక్సిన్లు వేస్తుండటమే ఇందుకు కారణం.నిన్నటి రోజున కరోనా కేసులు భారీగా తగ్గాయి. అయితే, ఈరోజు స్వల్పంగా కేసులు పెరిగినట్టు ఆరోగ్యశాఖ తెలియజేసింది. తాజా బులిటెన్ ప్రకారం దేశంలో కొత్తగా 38,792 కరోనా కేసులు నమోదయ్యాయి.దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,09,46,974కి చేరింది. ఇందులో 3,01,04,720 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 4,29,946 కేసులు యాక్టీవ్గా ఉన్నాయి.
ఇక గడిచిన 24 గంటల్లో భారత్ లో కరోనాతో 624 మంది మృతి చెందారు.దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 4,11,408కి చేరింది.ఇకపోతే, గడిచిన 24 గంటల్లో 41,000 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దేశంలో 24 గంటల్లో 37,14,441 మందికి టీకాలు వేసినట్టు ఆరోగ్యశాఖ తెలియజేసింది.దీంతో ఇప్పటి వరకు మొత్తం 38,76,97,935 మంది ప్రజలకు వ్యాక్సిన్ ను అందించారు.
తాజా వార్తలు
- ఇండియాకు ఒమన్ ఎయిర్ అదనపు సర్వీసులు
- ఫుజైరాలో వీధుల్లో వైల్డ్ క్యాట్ సంచారం..!
- రెసిడెన్సీ పర్మిట్ల కోసం లంచం.. నలుగురికి జైలుశిక్ష, జరిమానా
- మహిళను చంపి, దుకాణానికి నిప్పంటించిన వ్యక్తి..అరెస్ట్
- యూఏఈ, జోర్డాన్, టర్కీలతో ఖతార్ కీలక చర్చలు..!
- యూఏఈలో ఇకపై చేతితో చెల్లింపులు..?
- పవన్ కళ్యాణ్ కు ఓటు వేసి గెలిపించాలని పిఠాపురం ప్రజలను కోరిన చిరంజీవి
- నేడు హైదరాబాద్కు రానున్న ప్రధాని మోడీ..ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈలో భారతీయుడు మృతి..ఎన్నారైల తోడ్పాటుతో స్వగ్రామానికి పార్దీవదేహాం
- కొనసాగుతున్నమూడో విడత పోలింగ్..