మనీ ల్యాండరింగ్ కేసులో జైలు శిక్షకు సమర్ధన
- July 14, 2021
బహ్రెయిన్: మనీ ల్యాండరింగ్ కేసులో నిందితులకు హై అప్పీల్స్ కోర్టు జైలు శిక్షను సమర్ధించింది. ఓ ప్రొడక్షన్ కంపెనీ అధినేత అలాగే ఇద్దరు ఈ కేసులో దోషులుగా తేలారు. గతంలో వీరికి న్యాయ స్థానం ఐదేళ్ల జైలు శిక్షతో పాటు, 5,000 బహ్రెయినీ దినార్స్ జరిమానా విధించింది. అలాగే దోషుల నుండి 200,000 బహ్రెయినీ దినార్స్ స్వాధీనం చేసుకోవల్సిందిగా న్యాయస్థానం ఆదేశించింది. ఈ కేసులో నాలుగో వ్యక్తి కూడా నిందితుడిగా ఉన్నప్పటికీ, సరైన ఆధారాలు లేని కారణంగా అతన్ని నిర్దోషిగా విడుదల చేసింది. పెద్ద మొత్తంలో డబ్బుని నిందితులు వ్యభిచారం ద్వారా సమీకరించినట్లు విచారణలో తేలింది. ఆ మొత్తాన్ని వేరు వేరు పద్ధతుల్లో ఇద్దరు నిందితులకు, మొదటి నిందితుడు చేరవేసినట్లు నిర్ధారించారు.
తాజా వార్తలు
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ
- బహ్రెయిన్లో న్యాయ సేవలకు ఈ-పేమెంట్ సర్వీస్..!!
- ఒమన్లో విద్యుత్ కేబుళ్ల చోరీ.. నలుగురి అరెస్టు..!!
- కువైట్లో కార్మికుల హక్కులకు మరింత రక్షణ..!!
- 2029 నాటికి అందుబాటులోకి అబుదాబి ‘స్ఫియర్’..!!
- హైదరాబాద్లో విదేశీ వర్సిటీలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!







