మనీ ల్యాండరింగ్ కేసులో జైలు శిక్షకు సమర్ధన

- July 14, 2021 , by Maagulf
మనీ ల్యాండరింగ్ కేసులో జైలు శిక్షకు సమర్ధన

బహ్రెయిన్: మనీ ల్యాండరింగ్ కేసులో నిందితులకు హై అప్పీల్స్ కోర్టు జైలు శిక్షను సమర్ధించింది. ఓ ప్రొడక్షన్ కంపెనీ అధినేత అలాగే ఇద్దరు ఈ కేసులో దోషులుగా తేలారు. గతంలో వీరికి న్యాయ స్థానం ఐదేళ్ల జైలు శిక్షతో పాటు, 5,000 బహ్రెయినీ దినార్స్ జరిమానా విధించింది. అలాగే దోషుల నుండి 200,000 బహ్రెయినీ దినార్స్ స్వాధీనం చేసుకోవల్సిందిగా న్యాయస్థానం ఆదేశించింది. ఈ కేసులో నాలుగో వ్యక్తి కూడా నిందితుడిగా ఉన్నప్పటికీ, సరైన ఆధారాలు లేని కారణంగా అతన్ని నిర్దోషిగా విడుదల చేసింది. పెద్ద మొత్తంలో డబ్బుని నిందితులు వ్యభిచారం ద్వారా సమీకరించినట్లు విచారణలో తేలింది. ఆ మొత్తాన్ని వేరు వేరు పద్ధతుల్లో ఇద్దరు నిందితులకు, మొదటి నిందితుడు చేరవేసినట్లు నిర్ధారించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com