బహ్రెయిన్లో BD22 మిలియన్ విలువైన మున్సిపల్ ప్రాజెక్టులు
- July 15, 2021
బహ్రెయిన్: ప్రజల జీవన ప్రమాణాలు పెంచటమే లక్ష్యంగా కింగ్డమ్ వ్యాప్తంగా గవర్నరేట్లలో BD22 మిలియన్ల విలువైన ప్రాజెక్టులను చేపట్టినట్లు బహ్రెయిన్ వెల్లడించింది. జనాభా ప్రాతిపదికన మున్సిపాలిటీ అవసరాలకు అనుగుణంగా మౌళిక సదుపాయాలను అభివృద్ధి చేస్తున్నట్లు వివరించింది. వీక్లీ మీటింగ్ లో మౌళికా సదుపాయాల అభివృద్ధి పనుల కోసం ఏర్పాటైన మంత్రుల కమిటీ ఈ విషయాన్ని వెల్లడించింది. సమావేశంలో భాగంగా 2021-2022 వార్షిక సంవత్సరానికిగాను పలు మున్సిపాలిటీ పరిధిలో చేపట్టిన ప్రాజెక్టులను పట్టణ ప్రణాళిక, మున్సిపాలిటీ వ్యవహారాలు, పనుల మంత్రిత్వ శాఖ మంత్రుల కమిటీకి వివరించింది. ప్రభుత్వ పరిధిలో చేపట్టిన పలు కీలక ప్రాజెక్టులు వచ్చే ఏడాది నాటికి కొలిక్కి వస్తాయని తెలిపింది. ఇప్పటి వరకు ప్రారంభమైన, టెండర్ దశలో ఉన్న ప్రాజెక్టులు 65 శాతం మేర ఉన్నాయని, మరో 23 శాతం ప్రాజెక్టులు డిజైన్ దశలో ఉండగా..మిగిలిన ప్రాజెక్టులు అధ్యాయన దశలో ఉన్నాయని మంత్రుల కమిటీకి వివరించింది.
తాజా వార్తలు
- దుబాయ్లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ
- బహ్రెయిన్లో న్యాయ సేవలకు ఈ-పేమెంట్ సర్వీస్..!!
- ఒమన్లో విద్యుత్ కేబుళ్ల చోరీ.. నలుగురి అరెస్టు..!!
- కువైట్లో కార్మికుల హక్కులకు మరింత రక్షణ..!!







