తెరుచుకున్న శబరిమల అయ్యప్ప ఆలయం
- July 17, 2021
కేరళ: కరోనా రెండో దశ విజృంభణ తర్వాత తొలిసారిగా శబరిమల అయ్యప్ప ఆలయంలోకి భక్తులను అనుమతిస్తున్నారు. ఈ రోజు తెల్లవారుజామున భక్తుల దర్శనార్థం తెరిచారు. అనంతరం సుప్రభాత, ఇతర సేవల దర్శనాలు ప్రారంభమయ్యాయి. ఐదు రోజుల పాటు ఆలయంలోకి భక్తులను అనుమతిస్తారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతిస్తున్నట్టు ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు చెప్పింది. అలాగే, కరోనా టీకా రెండు డోస్లు వేసుకున్నవారు, ఆర్టీపీసీఆర్ నెగెటివ్ రిపోర్టు తీసుకొచ్చిన వారికే అనుమతి ఉంటుందని, దర్శనానికి వచ్చే వారు 72 గంటల ముందు చేయించుకున్న కరోనా పరీక్షను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటామని తెలిపింది. ఇందుకోసం ఇప్పటికే ఆన్లైన్ బుకింగ్ సౌకర్యాలు కల్పించారు. ముందుగా టికెట్లు బుక్ చేసుకున్న వారికి అవకాశం కల్పిస్తున్నారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







