ఈద్ అల్ అధా ప్రార్ధనలకు పిల్లలు, వృద్ధులపై ఆంక్షలు

- July 17, 2021 , by Maagulf
ఈద్ అల్ అధా ప్రార్ధనలకు పిల్లలు, వృద్ధులపై ఆంక్షలు

అబుధాబి: కోవిడ్ నేపథ్యంలో ఈద్ అల్ అధా ప్రార్ధనలపై ఆంక్షలు విధించింది అబుధాబి. 12 ఏళ్లలోపు పిల్లలు, 60 ఏళ్లు దాటిన వృద్ధులు పబ్లిక్ ప్లేయర్ కు హజరు కావొద్దని సూచించింది. అలాగే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు, శ్వాసకోస వ్యాధులు ఉన్నావారు, కోవిడ్ 19 చికిత్స పొందుతున్న పేషెంట్లకు సాయంగా ఉన్నవారు కూడా పబ్లిక్ ప్రేయర్ లో పాల్గొనొద్దని అబుధాభి అత్యవసర, విపత్తుల నిర్వహణ కమిటీ ఆంక్షలు విధించింది. ఇక ప్రార్ధనలకు హజరయ్యేవారు కూడా కోవిడ్ నిబంధనలు ఖచ్చితంగా పాటించి తీరాలన్నారు. ఫేస్ మాస్క్, భౌతిక దూరం పాటించటంతో పాటు షేక్ హ్యాండ్ ఇచ్చుకోవటం, ఒకేదగ్గర గుమికూడి ముచ్చటించుకోవటం, ప్రార్ధన అనంతరం ఆలింగనంతో శుభాకాంక్షలు తెలిపుకోవటం మానుకోవాలని స్పష్టం చేసింది.  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com