ఏపీ లో నామినేటెడ్ పోస్టుల ప్రకటన
- July 17, 2021
విజయవాడ: ప్రభుత్వ సంస్థల్లో నామినేటెడ్ పోస్టులను ఏపీ ప్రభుత్వం భర్తీ చేసింది. ఇవ్వాళ విజయవాడలో ఆ భర్తీల వివరాలను హోం మంత్రి సుచరితతో కలిసి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. 135 కార్పొరేషన్లు, సంస్థలకు చైర్మన్లను, డైరెక్టర్లను నియమించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 56 శాతం పదవులను కేటాయించారు. 68 మంది మహిళలకు అవకాశం ఇచ్చారు.
వీఎంఆర్డీఏ చైర్ పర్సన్ గా అక్కరమాని విజయనిర్మల, ఏపీఎస్ఆర్టీసీ రీజినల్ చైర్ పర్సన్ గా గాదల బంగారమ్మ, మేరిటైం బోర్డు చైర్మన్ గా కాయల వెంకట్ రెడ్డి, టిడ్కో చైర్మన్ గా జమ్మాన ప్రసన్న కుమార్, పౌరసరఫరాల కార్పొరేషన్ చైర్మన్ గా ద్వారంపూడి భాస్కర్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ గా నెక్కల నాయుడు బాబు, ఏపీ గ్రీనింగ్ బ్యూటీ కార్పొరేషన్ చైర్మన్ గా ఎన్. రామారావు, తిరుపతి స్మార్ట్ సిటీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్సన్ గా నరమల్లి పద్మజ, కాపు కార్పొరేషన్ చైర్మన్ గా అడపా శేషగిరి, విమెన్స్ కోఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ గా హేమ మాలిని రెడ్డిలను నియమించారు.
కాగా, పదవుల నియామకాల్లో సామాజిక న్యాయం పాటించామని సజ్జల అన్నారు. పదవులేవీ అలంకార ప్రాయం కాదన్నారు. పదవులు పొందిన వారంతా బాధ్యతాయుతంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకే 76 పదవులను ఇచ్చామని ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







