మహారాష్ట్రలో కొండచరియలు విరిగిపడి 20 మంది మృతి

- July 18, 2021 , by Maagulf
మహారాష్ట్రలో కొండచరియలు విరిగిపడి 20 మంది మృతి

ముంబై: మహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరిగింది. భారీ వర్షాలకు చెంబూరు,విఖ్రోలి ప్రాంతాల్లో నివాసాలపై కొండచరియలు విరిగిపడ్డాయి.ఈ ప్రమాదంలో 20 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు.భారీ వర్షాల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా రెడ్‌ అలెర్ట్‌ విధించిన సంగతి తెలిసిందే.ముంబైలో శనివారం 156.94 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందనిబృహన్‌ ముంబై కార్పోరేషన్‌ (BMC) తెలిపింది. చెంబూరులోని భరత్‌ నగర్‌ నుండి 17 మందిని, విఖ్రోలి సూర్య నగర్‌ నుండి మరో 9 మందిని రక్షించినట్లు పేర్కొంది. రెండు ప్రాంతాల్లోనూ సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, శిథిలాల కింద మరింత మంది చిక్కుకుని ఉండవచ్చని అధికారులు తెలిపారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com