అబుధాబిలో రాడార్స్ ఆక్టివేషన్..రాత్రివేళ బయటికొస్తే ఫైన్

- July 19, 2021 , by Maagulf
అబుధాబిలో రాడార్స్ ఆక్టివేషన్..రాత్రివేళ బయటికొస్తే ఫైన్

అబుధాబి: కోవిడ్ వ్యాప్తి నియంత్రణకు స్టెరిలైజేషన్ చేపట్టిన అబుధాబి పాలనా యంత్రాంగం..ప్రజలను బయటికి రాకుండా కట్టడి చేసేందుకు పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది. అబుధాబి వ్యాప్తంగా ఇవాళ్టి (సోమవారం) నుంచి స్టెరిలైజేషన్ ప్రారంభం కానుంది. స్టెరిలైజేషన్ ప్రక్రియకు అవాంతరాలు లేకుండా మధ్యరాత్రి 12 నుంచి తెల్లవారుజాము 5 గంటల వరకు ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రావొద్దని ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. అహారం, మెడిసిన్ వంటి అత్యవసర అవసరాలు ఉన్నవారికి మాత్రమే ఇళ్ల నుంచి బయటికి రావొచ్చు. అదీ కూడా అబుధాబి పోలీసుల నుంచి ముందస్తుగా పర్మిషన్ తీసుకొని ఉండాలి. అంటే దాదాపుగా ఆంక్షలు అమలులో ఉన్న ఈ 5 గంటలు కర్ఫ్యూ విధించినట్లే అనమాట. ఈ సమయంలో ఎవరైనా ఆంక్షలను అతిక్రమించి ఇళ్ల నుంచి బయటికి వచ్చేవారుంటే వారిని గుర్తించేందుకు రాడార్ వ్యవస్థను యాక్టివేట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ రాడార్స్ సాయంతో ఆంక్షలను అతిక్రమించినవారిని గుర్తించి జరిమానా విధిస్తామని హెచ్చరించారు. 

 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com