పవిత్ర స్థలాల్లో మొబైల్ ఫీల్డ్ ఆస్పత్రులు ఏర్పాటు
- July 19, 2021సౌదీ: హజ్ యాత్ర నేపథ్యంలో పవిత్ర స్థలాలలో యాత్రికులకు సేవ చేయడానికి ఆరోగ్య మంత్రిత్వ శాఖ మొబైల్ ఫీల్డ్ ఆసుపత్రిని సిద్ధం చేసింది. అరాఫత్ ప్రాంతం, నమీరా మసీదుకు ఉత్తర ప్రాంతంతో పాటు అవసరమైన ఇతర ప్రాంతాలలో వైద్య సేవలను అందించేందుకు ఏర్పాట్లు చేసింది. ఈ మొబైల్ ఫీల్డ్ ఆస్పత్రుల్లో డాక్టర్లు, నర్సులు, కన్సల్టెంట్ల బృందం ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లోనూ పేషెంట్లకు వైద్యం అందించేలా మొత్తం 11 పడకలతో ఏర్పాట్లు ఉన్నాయి. వాటిలో రెండు ఇంటెన్సివ్ కేర్, నాలుగు ఇన్ పేషెంట్ కేర్, ఐదు మెడికల్ కేర్ పడకలుగా కేటాయించారు. అలాగే ఎమర్జెన్సీ పరిస్థితులను ఎదుర్కొనేందుకు సరిపడా వెంటిలేటర్లు, డీఫిబ్రిలేటర్లను ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- మే 13న నాలుగో విడత పోలింగ్..
- తెలంగాణ మేనిఫెస్టో విడుదల చేసిన టి-కాంగ్రెస్..
- ఇంటర్ పాసైన విద్యార్థులకు అలర్ట్.. దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి వ్యతిరేకంగా నిరసనలు..
- శంషాబాద్ విమానాశ్రయం వద్ద బోనులో చిక్కిన చిరుత
- హైదరాబాద్ లోని OYO హోటల్ లో భారీ అగ్ని ప్రమాదం
- యూఏఈ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు..అలెర్ట్ జారీ
- యూఏఈ అధ్యక్షుడికి సంతాపాన్ని తెలిపిన సుల్తాన్
- కువైట్ వెదర్ రిపోర్ట్.. వారాంతంలో మిశ్రమ వాతావరణం
- నాన్-అయోనైజింగ్ రేడియేషన్ స్థాయిలను తెలిపే ప్లాట్ఫారమ్ ప్రారంభం