పెట్రోల్ ట్యాంకర్ను ఢీకొట్టిన మరో వాహనం..13 మంది మృతి
- July 19, 2021కెన్యా: కెన్యాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.పెట్రోల్ ట్యాంకర్ను మరో వాహనం ఢీకొనడంతో ట్యాంకర్ పేలిపోయింది.ఈ ప్రమాదంలో 13 మంది మృతి చెందగా, చాలా మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు.విషయం తెలుసుకున్న పోలీసులు,అధికారులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.నైరోబికి వాయువ్య దిశలో 315 కిలోమీటర్ల దూరంలో ఉన్న మలంగా సమీపంలో కిసుము, ఉగాండా సరిహద్దులో ఈ ప్రమాదం జరిగింది. ఘటన స్థలానికి క్రెన్లతో చేరుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో మంటలు భారీ ఎత్తున ఎగిసిపడటంతో అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. మృతుల్లో చిన్న పిల్లలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కెన్యాలో ఇటువంటి ప్రమాదాలు జరగడం ఇది కొత్తేమి కాదు. 2009లో గ్యాస్ ట్యాంకర్ పేలి సుమారు 120 మంది వరకు మరణించారు.ఇవే కాకుండా మరెన్నో ఘటనలు జరిగాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.
తాజా వార్తలు
- మే 13న నాలుగో విడత పోలింగ్..
- తెలంగాణ మేనిఫెస్టో విడుదల చేసిన టి-కాంగ్రెస్..
- ఇంటర్ పాసైన విద్యార్థులకు అలర్ట్.. దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి వ్యతిరేకంగా నిరసనలు..
- శంషాబాద్ విమానాశ్రయం వద్ద బోనులో చిక్కిన చిరుత
- హైదరాబాద్ లోని OYO హోటల్ లో భారీ అగ్ని ప్రమాదం
- యూఏఈ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు..అలెర్ట్ జారీ
- యూఏఈ అధ్యక్షుడికి సంతాపాన్ని తెలిపిన సుల్తాన్
- కువైట్ వెదర్ రిపోర్ట్.. వారాంతంలో మిశ్రమ వాతావరణం
- నాన్-అయోనైజింగ్ రేడియేషన్ స్థాయిలను తెలిపే ప్లాట్ఫారమ్ ప్రారంభం