అమెరికా విమాన చార్జీలు అమాంతం పెంపు
- July 21, 2021న్యూఢిల్లీ: ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లే విద్యార్థులకు విమానయాన సంస్థలు షాకిచ్చాయి. విమాన చార్జీలను అమాంతం పెంచేశాయి. కరోనా నేపథ్యంలో విమానాలు పరిమితంగా నడవడం, అమెరికాకు వెళ్లే విద్యార్థుల సంఖ్య భారీగా ఉండడమే ఇందుకు కారణం. మన దేశంతోపాటు అమెరికాలోనూ కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి.దీంతో భారత్లోని అమెరికా కాన్సులేట్ కార్యాలయాలు వీసా జారీ ప్రక్రియను మొదలుపెట్టాయి.
వచ్చే నెల నుంచి అమెరికాలోని యూనివర్సిటీలు తెరుచుకోనున్న నేపథ్యంలో తొలుత విద్యార్థి వీసాలను మాత్రమే జారీ చేస్తున్నాయి. ఈసారి చాలా పెద్ద సంఖ్యలో విద్యార్థులకు వీసాలు లభించినట్టు తెలుస్తోంది. వీరందరూ అమెరికా వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు, అంతర్జాయ విమాన సర్వీసులు ఇంకా పూర్తిస్థాయిలో మొదలు కాలేదు. దీంతో అమెరికాకు పరిమిత సంఖ్యలోనే విమానాలు నడుస్తున్నాయి. డిమాండ్కు సరిపడా సేవలు లేకపోవడంతో ఆయా సంస్థలు విమాన చార్జీలను అమాంతం పెంచేశాయి. మామూలుగా హైదరాబాద్ నుంచి అమెరికా వెళ్లే విమానంలో ఎకానమీ క్లాస్ టికెట్ ధర రూ.60 వేలు కాగా, ఇప్పుడది ఏకంగా రూ. 90 వేల నుంచి రూ. 2.20 లక్షల వరకు ఉంది.అయితే, అమెరికన్ ఎయిర్లైన్స్, ఎయిర్ ఇండియా, ఖతార్ ఎయిర్లైన్స్ విమానాల్లో ఇది రూ.90 వేలుగా ఉంది.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్