నా ఫోన్ ట్యాప్ అయ్యింది: రాహుల్ గాంధీ
- July 23, 2021న్యూఢిల్లీ: పెగాసస్ హ్యాకింగ్ గురించి రాహుల్ గాంధీ స్పందించారు.పెగాసస్ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.నా మైబైల్ ఫోన్ను కూడా ట్యాపింగ్ చేశారని ఆరోపించారు.నేను ప్రతిపక్ష నాయకుడిని..ప్రజల గళాన్ని నేను వినిపిస్తాను. నా ఫోన్ ట్యాపింగ్ చర్య ప్రజల గళానికి వ్యతిరేకంగా జరిగిన దాడి. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా రాజీనామా చేయాల్సిందే. పెగాసస్పై సుప్రీంకోర్టులో విచారణ జరగాలి అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.
ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా స్పైవేర్ సాఫ్ట్ వేర్ వాడారని రాహుల్ గాంధీ అన్నారు.సీబీఐ డైరెక్టర్ ఫోన్ను కూడా ట్యాపింగ్ చేశారని చెప్పారు. ఉగ్రవాదులకు వ్యతిరూకంగా పెగాసస్ వాడినట్లు ఇప్పటికే ఇజ్రాయెల్ తెలిపిందని ఆయన అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షా దేశానికి వ్యతిరేకంగా పెగాసస్ వాడారని ఆయన ఆరోపించారు.
రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ చర్యలకు పాల్పడ్డారని రాహుల్ గాంధీ చెప్పారు. సుప్రీంకోర్టుకు వ్యతిరేకంగానూ పెగాసస్ వాడారని, దేశంలోని అన్ని సంస్థలకూ వ్యతిరేకంగా దాన్ని వాడారని ఆరోపించారు.పెగాసస్ వినియోగించి రాజద్రోహానికి పాల్పడ్డారంటూ మండిపడ్డారు.
తాజా వార్తలు
- తెలంగాణలోని 10 వర్సిటీలకు ఇన్ఛార్జి వీసీల నియామకం
- సింగపూర్ విమానంలో భారీ కుదుపులు...ఒకరి మృతి
- అమెరికా కోర్టు న్యాయమూర్తిగా తెలుగు మహిళ జయ బాడిగ
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మృతి..భారత్ సంతాపం
- ఆ రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు: బెంగళూరు పోలీస్ కమిషనర్
- జూన్ 1 నుండి సింగిల్ యూజ్ స్టైరోఫోమ్ ఉత్పత్తుల బ్యాన్
- ప్రస్తుత ట్రాఫిక్ రికార్డును బద్దలు కొట్టనున్న DXB..!
- నకిలీ వెబ్సైట్ల గురించి పోలీసుల హెచ్చరిక
- మధుమేహం ఉన్న పిల్లలకు గ్లూకోజ్ సెన్సార్లు, ఇన్సులిన్ పంపిణీ
- మే 24 - జూన్ 26 మధ్య హజ్ అనుమతి ఉంటేనే ఉమ్రా..!