నా ఫోన్ ట్యాప్ అయ్యింది: రాహుల్ గాంధీ
- July 23, 2021
న్యూఢిల్లీ: పెగాసస్ హ్యాకింగ్ గురించి రాహుల్ గాంధీ స్పందించారు.పెగాసస్ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.నా మైబైల్ ఫోన్ను కూడా ట్యాపింగ్ చేశారని ఆరోపించారు.నేను ప్రతిపక్ష నాయకుడిని..ప్రజల గళాన్ని నేను వినిపిస్తాను. నా ఫోన్ ట్యాపింగ్ చర్య ప్రజల గళానికి వ్యతిరేకంగా జరిగిన దాడి. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా రాజీనామా చేయాల్సిందే. పెగాసస్పై సుప్రీంకోర్టులో విచారణ జరగాలి అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.
ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా స్పైవేర్ సాఫ్ట్ వేర్ వాడారని రాహుల్ గాంధీ అన్నారు.సీబీఐ డైరెక్టర్ ఫోన్ను కూడా ట్యాపింగ్ చేశారని చెప్పారు. ఉగ్రవాదులకు వ్యతిరూకంగా పెగాసస్ వాడినట్లు ఇప్పటికే ఇజ్రాయెల్ తెలిపిందని ఆయన అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షా దేశానికి వ్యతిరేకంగా పెగాసస్ వాడారని ఆయన ఆరోపించారు.
రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ చర్యలకు పాల్పడ్డారని రాహుల్ గాంధీ చెప్పారు. సుప్రీంకోర్టుకు వ్యతిరేకంగానూ పెగాసస్ వాడారని, దేశంలోని అన్ని సంస్థలకూ వ్యతిరేకంగా దాన్ని వాడారని ఆరోపించారు.పెగాసస్ వినియోగించి రాజద్రోహానికి పాల్పడ్డారంటూ మండిపడ్డారు.
తాజా వార్తలు
- అమెరికాతో శాంతి చర్చలకు ముందు ఇరాన్ మరో రెండు కొత్త షరతులు..
- ఏప్రిల్ 14న దేశంలో తొలి క్వాంటం టెస్ట్ ఫెసిలిటీ ప్రారంభం
- 26 మందిని స్వదేశానికి రప్పించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశం
- ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్కు కొత్త దిశ
- ఇరాన్ దాడుల్లో గాయపడిన వారి చికిత్సపై అబూదాబి పోలీస్ చీఫ్ సమీక్ష
- యూపీలో ఘోర పడవ ప్రమాదం..10 మంది మృతి
- కేసీఆర్తో జీవన్ రెడ్డి భేటీ
- డ్రోన్ అటాక్స్ పై కువైట్ వార్నింగ్..!!
- ఖతార్లో భారత విదేశాంగ మంత్రి కీలక చర్చలు..
- సోహార్ లో భారీగా ఆల్కాహాల్ సీజ్..!!









