నా ఫోన్ ట్యాప్ అయ్యింది: రాహుల్ గాంధీ
- July 23, 2021న్యూఢిల్లీ: పెగాసస్ హ్యాకింగ్ గురించి రాహుల్ గాంధీ స్పందించారు.పెగాసస్ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.నా మైబైల్ ఫోన్ను కూడా ట్యాపింగ్ చేశారని ఆరోపించారు.నేను ప్రతిపక్ష నాయకుడిని..ప్రజల గళాన్ని నేను వినిపిస్తాను. నా ఫోన్ ట్యాపింగ్ చర్య ప్రజల గళానికి వ్యతిరేకంగా జరిగిన దాడి. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా రాజీనామా చేయాల్సిందే. పెగాసస్పై సుప్రీంకోర్టులో విచారణ జరగాలి అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.
ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా స్పైవేర్ సాఫ్ట్ వేర్ వాడారని రాహుల్ గాంధీ అన్నారు.సీబీఐ డైరెక్టర్ ఫోన్ను కూడా ట్యాపింగ్ చేశారని చెప్పారు. ఉగ్రవాదులకు వ్యతిరూకంగా పెగాసస్ వాడినట్లు ఇప్పటికే ఇజ్రాయెల్ తెలిపిందని ఆయన అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షా దేశానికి వ్యతిరేకంగా పెగాసస్ వాడారని ఆయన ఆరోపించారు.
రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ చర్యలకు పాల్పడ్డారని రాహుల్ గాంధీ చెప్పారు. సుప్రీంకోర్టుకు వ్యతిరేకంగానూ పెగాసస్ వాడారని, దేశంలోని అన్ని సంస్థలకూ వ్యతిరేకంగా దాన్ని వాడారని ఆరోపించారు.పెగాసస్ వినియోగించి రాజద్రోహానికి పాల్పడ్డారంటూ మండిపడ్డారు.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల పర్వం..
- కాంగ్రెస్ పార్టీ నేషనల్ స్టార్ క్యాంపెయినర్గా కీలక బాధ్యతలు
- అయోధ్యలోని బాల రాముడి నుదుటిపై తిలకం దిద్దిన సూర్య భగవానుడు
- భారీ వర్షాలు..ఎమిరేట్స్ ప్రయాణికులకు చెక్-ఇన్ నిలిపివేత
- ఒమన్లో భారీ వర్షాలు.. జనజీవనం అస్తవ్యస్తం
- తూర్పు ప్రావిన్స్లో భారీ వర్షం.. రియాద్లో అలెర్ట్ జారీ
- భారీ వర్షాలతో విద్యుత్, ఇంటర్నెట్,మంచినీటి సమస్యలు..!
- దుబాయ్ లో మెట్రో సేవలకు అంతరాయం
- సాల్మియాలో ఇద్దరు ప్రవాసులు అరెస్ట్
- భద్రాద్రిలో శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం..