కరోనా ఆంక్షలు ఎత్తివేసిన బహ్రెయిన్
- July 24, 2021
మనామా: మహమ్మారి కరోనా నుంచి కోలుకుంటున్న బహ్రెయిన్ నెమ్మదిగా సాధారణ జీవనంవైపు అడుగులేస్తోంది.దీనిలో భాగంగా శుక్రవారం నుంచి పలు మినహాయింపులు ఇచ్చింది. వ్యాపార సముదాయాలపై ఇన్నాళ్లు ఉన్న ఆంక్షలను తొలగించింది. షాపింగ్ మాల్స్, రెస్టారెంట్స్, కేఫ్స్, జీమ్స్, స్విమ్మింగ్ పూల్స్, బార్బర్ షాప్స్, సెలూన్, స్పాలపై ఉన్న ఆంక్షలను ఎత్తివేసింది.అలాగే ప్రభుత్వ కార్యాలయాలు, ఔట్డోర్ క్రీడా కార్యక్రమాలపై కూడా ఆంక్షలను పూర్తిగా తొలగించింది.ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ రేటు బాగా తగ్గిన నేపథ్యంలో ఇంతకుముందు ఉన్న ఆరేంజ్ లెవెల్ అలర్ట్ను గ్రీన్ లెవెల్కు మార్చింది.ఈ మేరకు కరోనాపై ఏర్పడిన నేషనల్ మెడికల్ టాస్క్ఫోర్స్ కమిటీ శుక్రవారం కీలక ప్రకటన చేసింది.
ప్రభుత్వం ఆమోదించిన కరోనా వ్యాక్సిన్ లను రెండు డోసులు తీసుకున్న వారు,రెండో డోసు వేసుకుని 14 రోజులు అవుతున్న వారు, కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న వారు స్పోర్ట్స్ ఈవెంట్, సినిమాలు,ఇండోర్ ఈవెంట్స్, సమావేశాలకు హాజరు కావొచ్చని కమిటీ పేర్కొంది. అలాగే ఎడ్యుకేషన్, ట్రైనింగ్ సంస్థలు కూడా సామాజిక దూరం,ముఖానికి మాస్క్ ధరించడం వంటి కరోనా నిబంధనలను పాటిస్తూ తమ కార్యకలాపాలను నిర్వహించుకోవచ్చని వెల్లడించింది.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- శాంతియుత అణుశక్తి వినియోగం పై అమెరికా–సౌదీ మధ్య కీలక ఒప్పందం
- WTC ఫైనల్-2027 వేదిక, తేదీలు ఖరారు
- యూఏఈలో భారతీయ పాస్పోర్ట్ దరఖాస్తుదారులకు కొత్త హెచ్చరిక..
- ఇన్ఫోసిస్ కొత్త సీఈవోగా ఆశిష్ కుమార్ దాష్
- సిక్కిం ఘటనపై భారత్కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్లో భారత పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్లో భారత రాయబారి విపుల్కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా







