టోక్యో ఒలింపిక్స్: ప్రీ-క్వార్టర్ ఫైనల్కు చేరుకున్న పీవీ సింధు
- July 28, 2021టోక్యో ఒలింపిక్స్: టోక్యో ఒలింపిక్స్లో భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు గొప్ప ప్రదర్శన కనబరుస్తున్నారు. మరో సులభమైన విజయంతో ప్రీ-క్వార్టర్ ఫైనల్కు చేరుకున్నారు సింధు.. 21-9, 21-16తో హాంకాంగ్ ప్లేయర్ చేంగ్ న్గాన్ను వరుస గేమ్లలో ఓడించి, సిరీస్లో మరో అడుగు ముందుకు వేసింది. టోక్యో ఒలింపిక్స్లో భారత పతకాల ఆశలను సజీవంగా ఉంచుతూ అప్రతిహత విజయాలతో దూసుకుని పోతుంది పీవీ సింధూ.
గ్రూప్ జేలో ఉన్న సింధు.. ఆదివారం మహిళల సింగిల్స్లో తొలి మ్యాచ్లో ఇజ్రాయెల్ షట్లర్తో తలపడిన సింధు.. కేవలం 28 నిమిషాల్లో మ్యాచ్ ముగించి, ఫస్ట్ మ్యాచ్లో సత్తా చాటింది. పీవీ సింధు 21-7, 21-10తో వరుస సెట్లలో సునాయాసంగా గెలిచింది. ఇప్పుడు రెండో గేమ్లో కూడా సునాయాశంగా గెలిచింది. ఈ విజయంతో ఆమె మహిళల సింగిల్స్లో ప్రీ క్వార్టర్స్కు చేరుకుంది. ఈ మ్యాచ్లో సింధు మొదటి నుంచి ఆధిపత్యం చెలాయించింది.
తాజా వార్తలు
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు
- శుభవార్త. కొత్తగా 10 ఏళ్ల బ్లూ రెసిడెన్సీ వీసా