ఆగస్ట్ నుంచి ఖతార్-భారత్ మధ్య నాన్ స్టాప్ ఫ్లైట్ సర్వీసులు

- July 29, 2021 , by Maagulf
ఆగస్ట్ నుంచి ఖతార్-భారత్ మధ్య నాన్ స్టాప్ ఫ్లైట్ సర్వీసులు

దోహా: వందేభారత్ మిషన్ లో భాగంగా ఆగస్ట్ నుంచి ఖతార్-భారత్ మధ్య నాన్ స్టాప్ ఫ్లైట్ సర్వీసులు ప్రారంభం కానున్నట్లు ఎయిరిండియా ప్రకటించింది.ఆగస్ట్ 1 నుంచి అక్టోబర్ 29 వరకు నాన్ స్టాప్ ఫ్లైట్ సర్వీసులు అందుబాటులో ఉంటాయి.దీంతో ముంబై, హైదరాబాద్, కొచ్చి నుంచి అదనంగా వారానికి రెండు విమానాలు నడపనున్నారు.అలాగే దోహా నుంచి కూడా వారానికి రెండు విమానాలు అదనంగా అందుబాటులోకి రానున్నాయి. అయితే..కోవిడ్ నేపథ్యంలో ఖతార్ ఎంట్రీకి అర్హతలను ప్రయాణికులు ముందే చెక్ చేసుకోవాలని ఎయిరిండియా సూచించింది. అంతర్జాతీయ ప్రయాణికులపై ఖతార్ విధించిన నిబంధనలు, సూచనలు, అవసరమైన డాక్యుమెంట్లను సరిచూసుకున్న తర్వాత అన్ని అర్హతలు ఉన్న వారే ప్రయాణానికి సిద్ధం కావాలని తెలిపింది. ఒకవేళ ఏదైనా కారణాలతో ప్రయాణికులకు బోర్డింగ్ నిరాకరిస్తే అందుకు తాము బాధ్యత వహించబోమని కూడా ఎయిరిండియా స్పష్టం చేసింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com