ఆగస్ట్ నుంచి ఖతార్-భారత్ మధ్య నాన్ స్టాప్ ఫ్లైట్ సర్వీసులు
- July 29, 2021
దోహా: వందేభారత్ మిషన్ లో భాగంగా ఆగస్ట్ నుంచి ఖతార్-భారత్ మధ్య నాన్ స్టాప్ ఫ్లైట్ సర్వీసులు ప్రారంభం కానున్నట్లు ఎయిరిండియా ప్రకటించింది.ఆగస్ట్ 1 నుంచి అక్టోబర్ 29 వరకు నాన్ స్టాప్ ఫ్లైట్ సర్వీసులు అందుబాటులో ఉంటాయి.దీంతో ముంబై, హైదరాబాద్, కొచ్చి నుంచి అదనంగా వారానికి రెండు విమానాలు నడపనున్నారు.అలాగే దోహా నుంచి కూడా వారానికి రెండు విమానాలు అదనంగా అందుబాటులోకి రానున్నాయి. అయితే..కోవిడ్ నేపథ్యంలో ఖతార్ ఎంట్రీకి అర్హతలను ప్రయాణికులు ముందే చెక్ చేసుకోవాలని ఎయిరిండియా సూచించింది. అంతర్జాతీయ ప్రయాణికులపై ఖతార్ విధించిన నిబంధనలు, సూచనలు, అవసరమైన డాక్యుమెంట్లను సరిచూసుకున్న తర్వాత అన్ని అర్హతలు ఉన్న వారే ప్రయాణానికి సిద్ధం కావాలని తెలిపింది. ఒకవేళ ఏదైనా కారణాలతో ప్రయాణికులకు బోర్డింగ్ నిరాకరిస్తే అందుకు తాము బాధ్యత వహించబోమని కూడా ఎయిరిండియా స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- నకిలీ సంస్థ పేరిట మ్యూల్ ఖాతాలు: బ్యాంకు మేనేజర్ సహా నలుగురి అరెస్ట్
- 17 రోజులు బ్యాంకులకు సెలవులు
- TGSRTC: ‘మీ టికెట్’ యాప్తో బస్పాస్లు ఇక డిజిటల్
- 16 ఏళ్ల లోపు యూజర్ల కోసం ఇన్స్టాగ్రామ్ కొత్త సేఫ్టీ అలర్ట్
- ఏపీ నూతన సీఎస్గా సాయిప్రసాద్
- ఇస్రో యువికా 2026, 9వ తరగతి విద్యార్థులకు గోల్డెన్ ఛాన్స్
- మార్చి 1 నుండి మెసేజింగ్ యాప్స్ కొత్త రూల్స్
- జెనీవాలో అమెరికాతో ఇరాన్ చర్చలు..!!
- రమదాన్ మొదటి వారంలో 10వేలకుపైగా తనిఖీలు..!!
- స్కూళ్లకు 3 వారాలపాటు వింటర్ సెలవులపై భిన్నభిప్రాయాలు..!!









