ఆగస్ట్ నుంచి ఖతార్-భారత్ మధ్య నాన్ స్టాప్ ఫ్లైట్ సర్వీసులు
- July 29, 2021
దోహా: వందేభారత్ మిషన్ లో భాగంగా ఆగస్ట్ నుంచి ఖతార్-భారత్ మధ్య నాన్ స్టాప్ ఫ్లైట్ సర్వీసులు ప్రారంభం కానున్నట్లు ఎయిరిండియా ప్రకటించింది.ఆగస్ట్ 1 నుంచి అక్టోబర్ 29 వరకు నాన్ స్టాప్ ఫ్లైట్ సర్వీసులు అందుబాటులో ఉంటాయి.దీంతో ముంబై, హైదరాబాద్, కొచ్చి నుంచి అదనంగా వారానికి రెండు విమానాలు నడపనున్నారు.అలాగే దోహా నుంచి కూడా వారానికి రెండు విమానాలు అదనంగా అందుబాటులోకి రానున్నాయి. అయితే..కోవిడ్ నేపథ్యంలో ఖతార్ ఎంట్రీకి అర్హతలను ప్రయాణికులు ముందే చెక్ చేసుకోవాలని ఎయిరిండియా సూచించింది. అంతర్జాతీయ ప్రయాణికులపై ఖతార్ విధించిన నిబంధనలు, సూచనలు, అవసరమైన డాక్యుమెంట్లను సరిచూసుకున్న తర్వాత అన్ని అర్హతలు ఉన్న వారే ప్రయాణానికి సిద్ధం కావాలని తెలిపింది. ఒకవేళ ఏదైనా కారణాలతో ప్రయాణికులకు బోర్డింగ్ నిరాకరిస్తే అందుకు తాము బాధ్యత వహించబోమని కూడా ఎయిరిండియా స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- విశాఖలో ఆర్భా సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ఆఫ్షోర్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభం
- IPL 2026: పంజాబ్ పై గుజరాత్ విజయం
- మే మూడో వారంలో సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల
- రేపు ఏపీలో భిన్నమైన వాతావరణం!
- కరీంనగర్ పోలీసుల కీలక ప్రకటన..
- సింగపూర్లో ఘనంగా స్వరలయ ఆర్ట్స్ సప్తమ వార్షికోత్సవ వేడుకలు
- పత్రికా స్వేచ్ఛే ప్రజాస్వామ్యానికి ప్రాణవాయువు: మంత్రి కందుల దుర్గేష్
- IPL 2026: హైదరాబాద్ పై కోల్కతా ఘన విజయం
- టీం శివప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన TSP T10
- జుబైల్లో ఘనంగా BBN మీట్ & గ్రీట్ కార్యక్రమం









