ఆగస్ట్ నుంచి ఖతార్-భారత్ మధ్య నాన్ స్టాప్ ఫ్లైట్ సర్వీసులు
- July 29, 2021
దోహా: వందేభారత్ మిషన్ లో భాగంగా ఆగస్ట్ నుంచి ఖతార్-భారత్ మధ్య నాన్ స్టాప్ ఫ్లైట్ సర్వీసులు ప్రారంభం కానున్నట్లు ఎయిరిండియా ప్రకటించింది.ఆగస్ట్ 1 నుంచి అక్టోబర్ 29 వరకు నాన్ స్టాప్ ఫ్లైట్ సర్వీసులు అందుబాటులో ఉంటాయి.దీంతో ముంబై, హైదరాబాద్, కొచ్చి నుంచి అదనంగా వారానికి రెండు విమానాలు నడపనున్నారు.అలాగే దోహా నుంచి కూడా వారానికి రెండు విమానాలు అదనంగా అందుబాటులోకి రానున్నాయి. అయితే..కోవిడ్ నేపథ్యంలో ఖతార్ ఎంట్రీకి అర్హతలను ప్రయాణికులు ముందే చెక్ చేసుకోవాలని ఎయిరిండియా సూచించింది. అంతర్జాతీయ ప్రయాణికులపై ఖతార్ విధించిన నిబంధనలు, సూచనలు, అవసరమైన డాక్యుమెంట్లను సరిచూసుకున్న తర్వాత అన్ని అర్హతలు ఉన్న వారే ప్రయాణానికి సిద్ధం కావాలని తెలిపింది. ఒకవేళ ఏదైనా కారణాలతో ప్రయాణికులకు బోర్డింగ్ నిరాకరిస్తే అందుకు తాము బాధ్యత వహించబోమని కూడా ఎయిరిండియా స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- 2029 నాటికి అందుబాటులోకి అబుదాబి ‘స్ఫియర్’..!!
- హైదరాబాద్లో విదేశీ వర్సిటీలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!
- ప్రాంతీయ భద్రత అంశంలో భారత్కు బహ్రెయిన్ కృతజ్ఞతలు..!!
- మసీర్హా పోర్టులో అగ్నిప్రమాదం.. వేగంగా స్పందించిన ఫైర్ ఫైటర్స్..!!
- నకిలీ వస్తువుల కొనుగోలుపై యూఏఈ హెచ్చరిక..రూ.2.3 కోట్ల వరకు జరిమానా, జైలు శిక్ష..!!
- ఖతార్లో చక్కెర కలిపిన పానీయాలపై ఎక్సైజ్ పన్ను అమలు..!!
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ







