వాట్సాప్ కు పోటీగా కేంద్రం కొత్త యాప్..

- July 29, 2021 , by Maagulf
వాట్సాప్ కు పోటీగా కేంద్రం కొత్త యాప్..

న్యూ ఢిల్లీ: వాట్సాప్ లో సెక్యూరిటీపై అనుమానాలు వ్యక్తమవుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం అలాంటి మరో కొత్త యాప్ ను తీసుకువచ్చింది.సందేశ్ గా ఆ యాప్ కు పేరు పెట్టారు.

ఈ యాప్ కు సంబంధించిన వివరాలను కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ లోక్ సభకు వివరించారు.ఈ యప్ చాలా సురక్షితమైనదని తెలిపారు.ఈ యాప్ కు సంబంధించిన నియంత్రణను కేంద్ర ప్రభుత్వమే చూసుకుంటుందని తెలిపారు.

వాట్సాప్ లో మాదిరిగా నే వన్ టూ వన్ మెజేసింగ్, గ్రూప్ మెసేజింగ్, ఫైల్, మీడియా షేరింగ్, ఆడియో, వీడియో కాల్స్, ఈ గవర్నమెంట్ అప్లికేషన్ తదితర ఫీచర్లు ఈ యాప్ లో ఉండనున్నాయి. ఈ యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ తో పాటు యాప్ స్టోర్ లోనూ అందుబాటులో ఉంచుతున్నామని చంద్రశేఖర్ వివరించారు.

ఈ యాప్ ను నేషనల్ ఎన్ఫోర్మేటిక్స్ సెంటర్(NIC) అభివృద్ధి చేసింది. NIC తో పాటు ప్రభుత్వ ఐటీ విభాగం కలిసి ఈ యాప్ ను లాంచ్ చేశాయి.

కేవలం మొబైల్ నంబర్ తో పాటే కాకుండా ఈమెయిల్ తోనూ ఓపెన్ చేసేలా సందేశ్ యాప్ ను రూపొందించారు. అయితే ఇప్పటివరకు కేవలం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, సర్కారు ఏజెన్సీలు మాత్రమే వాడుతున్న ఈ యాప్ ఇప్పుడు అందరికీ అందుబాటులోకి వచ్చేసింది.

ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్ ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అనంతరం ఫోన్ నంబర్ ను నమోదు చేసి, ఓటీపీని వెరిఫికేషన్ చేస్తే ఈ యాప్ ను వాడుకోవచ్చు.

ఈ యాప్ కు సంబంధించిన కొన్ని వివరాలు..

  • ఈ యాప్ కు వెబ్ వెర్షన్ కూడా అందుబాటులో ఉంది.సందేశ్ వెబ్ పోర్టల్ ద్వారా దీనిని వినియోగించుకోవచ్చు.అందులో మొబైల్ నంబర్ లేదా ఈ మెయిల్ ఐడీని నమోదు చేయాల్సి ఉంటుంది.అనంతరం ఓటీపీ వస్తుంది.ఆ ఓటీపీని నమోదు చేస్తే సందేశ్ వెబ్ ఓపెన్ అవుతుంది.
  • ఇప్పటివరకు ప్రభుత్వ ఈ మెయిల్ ఐడీతో మాత్రమే సందేశ్ లో ఖాతా తెరవాలనే నిబంధన ఉండేది. అయితే ఇప్పుడు ఈ నిబంధనను మార్చారు.
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com