ఎక్స్పో 2020 దుబాయ్: కరోనా తర్వాత ఆర్ధిక రంగానికి కొత్త ఊతం
- July 30, 2021దుబాయ్: ప్రపంచంలోనే అతి పెద్ద షో. దుబాయ్ ఎక్స్పో 2020 కరోనా తర్వాత ఆర్ధిక రంగానికి కొత్త ఊతాన్ని ఇవ్వనుందని భారత కాన్సూల్ జనరల్ డాక్టర్ అమన్ పురి చెప్పారు. ఆర్ధిక రంగం తిరిగి పుంజుకోవడానికి ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు, వ్యాపార సంస్థలు దీన్నొక అద్భుతమైన వేదికగా మార్చుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రస్తుత ఛాలెంజింగ్ పరిస్థితుల్లో యుఏఈ సాహసోపేతంగా ఈ ఈవెంట్ నిర్వహించడాన్ని అభినందించారాయన. ఈ ఎక్స్పో ద్వారా వివిధ రంగాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడుల్ని ఆకర్షించాలని భారతదేశం భావిస్తోందని అన్నారు. మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా మరియు స్టార్టప్ ఇండియా నినాదాలతో ఈ ఎక్స్పో ద్వారా ప్రపంచం దృష్టిని ఆకర్షించాలనుకుంటున్నట్లు చెప్పారు. లక్షలాది, కోట్లాది ఆలోచనలకు ఇండియా మంచి వేదిక. కాబట్టి, ప్రపంచం ఈ ఆలోచనల నుంచి లాభపడాలనీ, అలాగే ప్రపంచ దేశాల నుండి భారత దేశం అత్యద్భుత సాయాన్ని అందుకోవాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఇండియా, కొరియా మధ్య బిజినెస్ మీట్ సందర్భంగా అమన్ పురి చెప్పారు. పలు ఎంబసీలతో ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతున్నామనీ ఆయా దేశాల నుంచి పెట్టుబడుల్ని ఆహ్వానిస్తున్నామనీ అన్నారు. ఇండియా, కొరియా భాగస్వామ్యం ప్రాంతంలో అత్యంత ప్రత్యేకమైనదనీ చెప్పారాయన. కొరియన్ కాన్సూల్ జనరల్ మూన్ బై యుంగ్ జున్ మాట్లాడుతూ ఇండియా, కొరియా ప్రపంచంలోనే అతి పెద్ద ఎకనమిక్ పవర్స్ అని అన్నారు.
తాజా వార్తలు
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి